Political News

అధికార పార్టీల‌కే ప్ర‌జ‌ల మొగ్గు.. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి!

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల‌కు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అధికార పార్టీ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. మొత్తం ఏడు స్థానాల్లో ఒక్క‌టి త‌ప్ప ఆరు చోట్ల అధికార పార్టీ వైపు ప్ర‌జ‌లు అండ‌గా నిలిచారు.

1) తెలంగాణ‌: ఇక్క‌డ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది. అధికార‌పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి 97 వేల పైచిలుకు ఓట్లు సాధించి.. విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నారు. ఆదిలో ప్ర‌తిప‌క్షం బీజేపీతో ఒకింత హోరా హోరీ పోరు సాగినా.. త‌ర్వాత ఇది అధికార పార్టీకి అనుకూలంగా మారి.. టీఆర్ ఎస్ విజ‌యం వైపు అడుగులు వేసింది.

2) ఉత్తర్ప్రదేశ్: ఇక్క‌డ గోల గోఖర్నాథ్ శాసనసభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార బీజేపీ పట్టు నిలుపుకుంది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్గిరి 34,298 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అమన్గిరి 1,24,810 ఓట్లు సాధించగా.. ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీకి 90,512 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో గోల గోఖర్నాథ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

3) హరియాణా: ఈ రాష్ట్రంలోని అధంపుర్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్పై 15,714 ఓట్ల తేడాతో భవ్య బిష్ణోయ్ విజయ కేతనం ఎగురవేశారు. అంతకుముందు అధంపుర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.

4) మహారాష్ట్ర: ఇక్క‌డి అంధేరి ఈస్ట్కు జరిగిన ఉపఎన్నికల్లో ప్ర‌తిప‌క్షం శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి రుతుజా లట్కే విజయకేతనం ఎగురవేశారు. ఈ ఏడాది మేలో శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన భార్య రుతుజా లట్కే శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) తరపున బరిలో దిగారు. ఆమెకు 66,247 ఓట్లు రాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న నోటాకు 12,776 ఓట్లు రావడం విశేషం.

5) బిహార్: ఈ రాష్ట్రంలో రెండు స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీజేపీ, ఆర్జేడీ చెరొక స్థానంలో గెలుపొందాయి. గోపాల్గంజ్ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా, మోకామాలో ఆర్జేడీ విజయం సాధించింది.

6) ఒడిశా: ఒడిశాలోని ధామ్నగర్ నియోజకవర్గంలో ప్ర‌తిప‌క్షం బీజేపీ అభ్యర్థి సూర్యభన్షి సూరజ్ ఓడిపోగా… అధికార పార్టీ బీజేడీ అభ్యర్థి అభంతి దాస్ 7,661 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Satya

Recent Posts

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

2 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

3 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

4 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

5 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

5 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

5 hours ago