Political News

చౌటుప్ప‌ల్ ముంచేసింది: కోమ‌టిరెడ్డి బ్లాస్ట్‌

హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బ్లాస్ట్ అయ్యారు. కీల‌క‌మైన మండ‌లంలో తాము దెబ్బ‌తిన్నామ‌ని చెప్పారు. చౌటుప్పల్‌లో తాము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదని, ఈ మండ‌లం ముంచేసింద‌ని వ్యాఖ్యానించారు. అయితే, మిగిలిన మండలాల్లోనూ పోరు హోరాహోరీగా సాగనుందని వివరించారు.

ఏం జ‌రిగింది?

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి రెండు పరిణామాలు టీఆర్ఎస్, బీజేపీలను కలవరపాటుకు గురిచేశాయి. తొలి రౌండ్‌‌లో చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు బీజేపీని తీవ్ర నిరాశ‌లో ముంచేశాయి. చౌటుప్పల్ మండలంపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మండలం చౌటుప్పల్. ఈ మండలంలో బీజేపీ భారీగా మెజార్టీ వస్తుందని భావించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చౌటుప్పల్ మండలంపై బోలెడాశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్‌ నాటికి చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాజగోపాల్‌రెడ్డికి ఆదరణ ఉంది.

కాగా అత్యధిక ఓటర్లు ఉన్న ఈ మండలంలో ఆధిపత్యం సాధించేందుకు అధికార టీఆర్ఎస్‌ వ్యూహాత్మకంగా పనిచేసింది. మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వంటి ఉద్ధండులకు ఇక్కడ ఎన్నికల బాధ్యత అప్పగించారు. బీజేపీ ఆధిపత్యాన్ని ఎన్నికల నాటికి తగ్గించామని టీఆర్ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. చివరకు అదే జరిగింది.

చౌటుప్పల్ మండలంలో బీజేపీకి మెజార్టీ రాకపోగా.. టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. 4 రౌండ్లతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు ముగిసింది. చౌటుప్పల్ మండలంలో మొత్తం పోలైన ఓట్లు 55,678. టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 21,209, బీజేపీ 21,174, కాంగ్రెస్ 5,164. చౌటుప్పల్ మండలంలో బీజేపీని ఆశించిన స్థాయిలో ఓటర్లు ఆదరించలేదని స్పష్టమైంది. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఈ విషయంలో నిరాశ చెందారు.

This post was last modified on November 6, 2022 1:35 pm

Share
Show comments
Published by
Satya
Tags: Choutuppal

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

19 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

50 minutes ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

50 minutes ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

4 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

4 hours ago