పెద్ద కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయింది. చిన్న కూతురు కూడా అదే విధంగా వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆమెను ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని రెల్లి వీధిలో జరిగింది. కూతుర్ని తానే చంపిన తండ్రి ఆ తర్వాత సెల్ఫీ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ సెల్ఫీ వీడియోను తండ్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కన్నతండ్రే కూతురిని హతమార్చిన ఘటన ఏపీలోని విశాఖపట్టణం నగరంలోని రెల్లివీధిలో జరిగింది. హత్య చేసిన అనంతరం సెల్ఫీ వీడియో తీసి తన కూతురిని తానే చంపేశానని చెబుతూ సామాజిక మధ్యమాలలో తన తండ్రి వడ్డాది ప్రసాద్ పోస్ట్ చేశాడు. నగరంలోని రెల్లివీధిలో నివాసం ఉంటున్న వడ్డాది ప్రసాద్ (42)ని భార్య హేమలత 13 సంవత్సరాల క్రితం వదిలేసి వేరుగా ఉంటోంది. ఆ 13 సంవత్సరాల నుంచి వీరి ఇద్దరు ఆడపిల్లల్ని ప్రసాద్ పెంచాడు.
పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోగా.. రెండు రోజులు క్రితం చిన్న కూతురు కూడా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు సమాచారం అందుకున్నాడు. దీంతో వన్ టౌన్ స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ చేసినప్పటికీ తన కూతురు మనసు మారలేదని.. కూతురు ప్రేమించిన వ్యక్తి పై కేసులు కూడా ఉన్నాయని తండ్రి నచ్చజెప్పినప్పటికి వినలేదని తెలిసింది.
దీంతో ప్రసాద్ తన తల్లి చనిపోయిన రోజు కావడంతో కూతుర్ని భోజనానికి రమ్మని ఇంటికి పిలిచాడు. తండ్రి మాటలను విశ్వసించిన కుమార్తె.. పాత గొడవలు మరిచిపోయాడని భావించి ఇంటికి వచ్చింది. అయితే, ఇదే అదునుగా.. ఆమెను నరికి నరికి హత్య చేసినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం వన్ టౌన్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on November 5, 2022 11:17 am
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…