పదవుల పంపకానికి సంబంధించి జోరు పెంచేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ.. ఇప్పటికి తనకు వీర విధేయులుగా వ్యవహరిస్తూ.. తనకు మద్దతుగా గళం విప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని పలువురికి ఆయన పదవులు ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉండటం తెలిసిందే. ఈ వాదనలకు చెక్ పెట్టే దిశగా జగన్ నిర్ణయాలు ఉండటం గమనార్హం. రెండు మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని అప్పజెప్పారు ప్రముఖ కమెడియన్ కమ్ యాంకర్ అలీ.
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరున్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం జగన్ పక్షాన నిలిచిన అలీకి..తాజాగా సలహాదారు పదవి ఇవ్వటం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు జగన్. అంతకు ముందు అలీ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు రావటం.. అదే సమయంలోనే ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని అప్పజెప్పటం ద్వారా సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది.
ఆయన్ను సలహాదారుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్న విషయాన్ని ఏపీ సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ కు వీర విధేయుడిగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున వకల్తా పుచ్చుకోవటమే కాదు.. అవసరానికి తగ్గట్లు.. ఆయన వైరి వర్గంపై విరుచుకుపడే బాధ్యతను నిర్వహించే పోసాని క్రిష్ణమూరళిని కీలక పదవికి ఎంపిక చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఆయన్ను ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోసాని నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో జగన్ పక్షాన వాదనలు వినిపించే మరో సినీ ప్రముఖుడికి కీలక పదవి లభించినట్లుగా చెప్పాలి. తాజాగా జగన్ దూకుడు చూస్తే.. రానున్న రోజుల్లో మరికొన్ని నియామకాల్ని కచ్ఛితంగా చేపడతారని చెబుతున్నారు. పదవీ కాలం మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటం.. ఎన్నికల వేళ.. మరింత మందిని తన సైన్యంగా మార్చుకునేందుకు వీలుగా.. మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…