తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గౌరవ అధ్యక్షులు రమణదీక్షితులు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ వేదికగా ఆయన ఈవో పైన ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ట్వీట్లో సీఎం జగన్తో పాటు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కూడా యాడ్ చేశారు.
చంద్రబాబు హయాంలో ఇరవైమందికి పైగా అర్చకులను రాజ్యాంగ విరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. జగన్ కూడా తమని మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ ఈవో, ఏఈవోలు చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారని తెలిపారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటూ… హైకోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికీ ఎదురు చూస్తున్నామన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం కూడా రమణదీక్షితులు చేసిన ట్వీట్ కలకలం రేపింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ను రీట్వీట్ చేశారు. త్వరలో తిరుమల కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి విముక్తి పొందుతుందని ఆకాంక్షించారు.
This post was last modified on July 11, 2020 5:03 pm
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…