తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గౌరవ అధ్యక్షులు రమణదీక్షితులు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ వేదికగా ఆయన ఈవో పైన ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ట్వీట్లో సీఎం జగన్తో పాటు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కూడా యాడ్ చేశారు.
చంద్రబాబు హయాంలో ఇరవైమందికి పైగా అర్చకులను రాజ్యాంగ విరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. జగన్ కూడా తమని మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ ఈవో, ఏఈవోలు చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారని తెలిపారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటూ… హైకోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికీ ఎదురు చూస్తున్నామన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం కూడా రమణదీక్షితులు చేసిన ట్వీట్ కలకలం రేపింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ను రీట్వీట్ చేశారు. త్వరలో తిరుమల కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి విముక్తి పొందుతుందని ఆకాంక్షించారు.
This post was last modified on July 11, 2020 5:03 pm
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…