జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటివరకు తమ మీద జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ విషయంపై ఆయన రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ సెలబ్రిటీ కావటం వల్ల.. ఆయన ఎక్కడకు వచ్చినా ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని.. ఆయన రాక కారణంగా ఇతురులకు ఇబ్బందులు కలగనివ్వకుండా ఉండేందుకు ఆయన పర్యటన వివరాల్ని తమకు ముందే తెలియజేయాలన్నారు.
తమకు పవన్ టూర్ మీద సమాచారం అందిస్తే.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం లేదన్నారు. కాకుంటే.. ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరినట్లుగా వ్యాఖ్యానించారు. పవన్ ఎక్కడికి వస్తారన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తే.. తాము అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్యానించటం గమనరా్హం.
నోరు తెరిస్తే.. పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచకుపడే ఏపీ అధికారపక్షానికి చెందిన కీలక నేత.. పవన్ పాల్గొనే కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫు నుంచి పక్కా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్న తీరు చూస్తే.. ఇప్పటికిప్పుడు బొత్స కు ఇలాంటి భావన ఎందుకు కలిగింది? ఇంతకాలం ఎందుకు కలగలేదు? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలినా.. వాటిని ప్రశ్నల రూపంలో వ్యక్తం చేయకుండా.. బొత్స వారు చెప్పిన రీతిలో ఫాలో కావాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కు అనుకూలంగా మాట్లాడినట్లే మాట్లాడి.. మరోవైపు టీడీపీ తమ్ముళ్లపై ఆయన చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.
తాను బీసీ నాయకుల సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారని.. తాను కాపు కులంలో పుట్టినా.. ఉత్తరాంధ్రలో తమను బీసీల్లో చేర్చారని సమాధానం ఇచ్చారు. తన మాటతో తనను తాను బీసీల ప్రతినిధిగా చెప్పుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఒకవైపు బీసీగా తనను తాను చెప్పుకుంటూనే.. మరోవైపు కాపు నేతగా ఎస్టాబ్లిష్ కావటమే కాదు.. పవన్ లాంటి అధినేత విషయంలో తానెంత సానుకూలంగా ఉన్నానన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసే తెలివి చూస్తే.. ఇలాంటివి బొత్సకు మాత్రమే సాధ్యమనిపించక మానదు.
This post was last modified on November 2, 2022 10:57 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…