జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటివరకు తమ మీద జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ విషయంపై ఆయన రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ సెలబ్రిటీ కావటం వల్ల.. ఆయన ఎక్కడకు వచ్చినా ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని.. ఆయన రాక కారణంగా ఇతురులకు ఇబ్బందులు కలగనివ్వకుండా ఉండేందుకు ఆయన పర్యటన వివరాల్ని తమకు ముందే తెలియజేయాలన్నారు.
తమకు పవన్ టూర్ మీద సమాచారం అందిస్తే.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం లేదన్నారు. కాకుంటే.. ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరినట్లుగా వ్యాఖ్యానించారు. పవన్ ఎక్కడికి వస్తారన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తే.. తాము అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్యానించటం గమనరా్హం.
నోరు తెరిస్తే.. పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచకుపడే ఏపీ అధికారపక్షానికి చెందిన కీలక నేత.. పవన్ పాల్గొనే కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫు నుంచి పక్కా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్న తీరు చూస్తే.. ఇప్పటికిప్పుడు బొత్స కు ఇలాంటి భావన ఎందుకు కలిగింది? ఇంతకాలం ఎందుకు కలగలేదు? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలినా.. వాటిని ప్రశ్నల రూపంలో వ్యక్తం చేయకుండా.. బొత్స వారు చెప్పిన రీతిలో ఫాలో కావాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కు అనుకూలంగా మాట్లాడినట్లే మాట్లాడి.. మరోవైపు టీడీపీ తమ్ముళ్లపై ఆయన చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.
తాను బీసీ నాయకుల సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారని.. తాను కాపు కులంలో పుట్టినా.. ఉత్తరాంధ్రలో తమను బీసీల్లో చేర్చారని సమాధానం ఇచ్చారు. తన మాటతో తనను తాను బీసీల ప్రతినిధిగా చెప్పుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఒకవైపు బీసీగా తనను తాను చెప్పుకుంటూనే.. మరోవైపు కాపు నేతగా ఎస్టాబ్లిష్ కావటమే కాదు.. పవన్ లాంటి అధినేత విషయంలో తానెంత సానుకూలంగా ఉన్నానన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసే తెలివి చూస్తే.. ఇలాంటివి బొత్సకు మాత్రమే సాధ్యమనిపించక మానదు.
This post was last modified on November 2, 2022 10:57 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…