ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అమరావతిని దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతోంది జగన్ సర్కారు. ఐతే తమ నుంచి భూములు సేకరించి, చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్నాక.. ఇలా రాజధానిని తరలించడం ఏం న్యాయమంటూ అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు.
జగన్ సర్కారు చేసింది చట్టవిరుద్ధం కావడంతో ఇప్పటిదాకా కోర్టులో ప్రతిసారీ అమరావతి రైతులదే పైచేయి అవుతూ వచ్చింది. కాగా ఈ కేసుపై తుది విచారణ సుప్రీం కోర్టులో జరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించాల్సిన కొత్త చీఫ్ జస్టిస్ యుయు లలిత్ ‘నాట్ బిఫోర్ మి’ కారణాన్ని చూపించి ఈ కేసు నుంచి తప్పుకున్నారు.
ఏదైనా కేసులో తనకు విరుద్ధ ప్రయోజనాలు తలెత్తుతాయని భావించినపుడు న్యాయమూర్తులు ఇలా ‘నాట్ బిఫోర్ మి’ ఆప్షన్ ఎంచుకుని ఆ కేసు నుంచి తప్పుకోవడం మామూలే. గతంలో యుయు లలిత్.. వైఎస్ జగన్ అవినీతి కేసుల్లో లాయర్గా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసును ఆయన విచారిస్తే విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుంది. అందుకే చీఫ్ జస్టిస్ గౌరవంగా ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులున్న బెంచ్ వద్దకు అమరావతి కేసు వెళ్లబోతోంది.
రాజధాని అంశం చాలా పెద్దది కావడం, అందులోనూ ఇప్పటికే కేసు మూడేళ్లుగా విచారణలో ఉన్న నేపథ్యంలో సాద్యమైనంత త్వరగా పరిష్కరించడానికే సుప్రీం కోర్టు చూడొచ్చు. మరి తుది విచారణ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తీర్పును అనుసరించి 2024 ఎన్నికల ముంగిట అమరావతి వ్యవహారం అత్యంత కీలకంగా మారే అవకాశముంది.
This post was last modified on November 1, 2022 2:05 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…