Political News

అమరావతి కేసు నుంచి తప్పుకున్న సీజే

ఆంధ్రప్రదేశ్‌‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అమరావతిని దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతోంది జగన్ సర్కారు. ఐతే తమ నుంచి భూములు సేకరించి, చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్నాక.. ఇలా రాజధానిని తరలించడం ఏం న్యాయమంటూ అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు.

జగన్ సర్కారు చేసింది చట్టవిరుద్ధం కావడంతో ఇప్పటిదాకా కోర్టులో ప్రతిసారీ అమరావతి రైతులదే పైచేయి అవుతూ వచ్చింది. కాగా ఈ కేసుపై తుది విచారణ సుప్రీం కోర్టులో జరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించాల్సిన కొత్త చీఫ్ జస్టిస్ యుయు లలిత్ ‘నాట్ బిఫోర్ మి’ కారణాన్ని చూపించి ఈ కేసు నుంచి తప్పుకున్నారు.

ఏదైనా కేసులో తనకు విరుద్ధ ప్రయోజనాలు తలెత్తుతాయని భావించినపుడు న్యాయమూర్తులు ఇలా ‘నాట్ బిఫోర్ మి’ ఆప్షన్‌ ఎంచుకుని ఆ కేసు నుంచి తప్పుకోవడం మామూలే. గతంలో యుయు లలిత్.. వైఎస్ జగన్ అవినీతి కేసుల్లో లాయర్‌గా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసును ఆయన విచారిస్తే విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుంది. అందుకే చీఫ్ జస్టిస్ గౌరవంగా ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులున్న బెంచ్ వద్దకు అమరావతి కేసు వెళ్లబోతోంది.

రాజధాని అంశం చాలా పెద్దది కావడం, అందులోనూ ఇప్పటికే కేసు మూడేళ్లుగా విచారణలో ఉన్న నేపథ్యంలో సాద్యమైనంత త్వరగా పరిష్కరించడానికే సుప్రీం కోర్టు చూడొచ్చు. మరి తుది విచారణ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తీర్పును అనుసరించి 2024 ఎన్నికల ముంగిట అమరావతి వ్యవహారం అత్యంత కీలకంగా మారే అవకాశముంది.

This post was last modified on November 1, 2022 2:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago