ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అమరావతిని దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతోంది జగన్ సర్కారు. ఐతే తమ నుంచి భూములు సేకరించి, చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్నాక.. ఇలా రాజధానిని తరలించడం ఏం న్యాయమంటూ అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు.
జగన్ సర్కారు చేసింది చట్టవిరుద్ధం కావడంతో ఇప్పటిదాకా కోర్టులో ప్రతిసారీ అమరావతి రైతులదే పైచేయి అవుతూ వచ్చింది. కాగా ఈ కేసుపై తుది విచారణ సుప్రీం కోర్టులో జరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించాల్సిన కొత్త చీఫ్ జస్టిస్ యుయు లలిత్ ‘నాట్ బిఫోర్ మి’ కారణాన్ని చూపించి ఈ కేసు నుంచి తప్పుకున్నారు.
ఏదైనా కేసులో తనకు విరుద్ధ ప్రయోజనాలు తలెత్తుతాయని భావించినపుడు న్యాయమూర్తులు ఇలా ‘నాట్ బిఫోర్ మి’ ఆప్షన్ ఎంచుకుని ఆ కేసు నుంచి తప్పుకోవడం మామూలే. గతంలో యుయు లలిత్.. వైఎస్ జగన్ అవినీతి కేసుల్లో లాయర్గా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసును ఆయన విచారిస్తే విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుంది. అందుకే చీఫ్ జస్టిస్ గౌరవంగా ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులున్న బెంచ్ వద్దకు అమరావతి కేసు వెళ్లబోతోంది.
రాజధాని అంశం చాలా పెద్దది కావడం, అందులోనూ ఇప్పటికే కేసు మూడేళ్లుగా విచారణలో ఉన్న నేపథ్యంలో సాద్యమైనంత త్వరగా పరిష్కరించడానికే సుప్రీం కోర్టు చూడొచ్చు. మరి తుది విచారణ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తీర్పును అనుసరించి 2024 ఎన్నికల ముంగిట అమరావతి వ్యవహారం అత్యంత కీలకంగా మారే అవకాశముంది.
This post was last modified on November 1, 2022 2:05 pm
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…