Political News

‘నోటా’ ప్రియులకు పవన్ పంచ్

ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకుంటే ‘నోటా’కు వేసేలా కొన్నేళ్ల కిందట కొత్త అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీని విషయంలో ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత రాజకీయ నేతల పట్ల తమ అసంతృప్తిని తెలియజేయడానికి ఇది సరైన మార్గం అని కొందరంటే.. ‘నోటా’కు వేయడం అంటే విలువైన ఓటు హక్కును వృథా చేసుకోవడమే అని ఇంకొందరంటారు. ఓవరాల్‌గా ‘నోటా’ గురించి తన అభిప్రాయం చెప్పలేదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో నోటాకు ఓటు వేసిన వారి పట్ల మాత్రం అసహనం వ్యక్తం చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్.

గత పర్యాయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 శాతం మంది, అంటే దాదాపు పది లక్షల మంది ‘నోటా’కు ఓటు వేయడం ద్వారా పరోక్షంగా క్రిమినల్స్‌కు సహకారం అందించారంటూ పవన్ పంచ్ విసిరాడు. మేధావుల పేరుతో కొందరు ‘నోటా’కు ఓటు వేసి రాష్ట్రానికి నష్టం చేశారన్నట్లు పవన్ మాట్లాడాడు. “కొందరు నోటా అంటారు. మాకు ఈ పార్టీ ఇష్టం లేదండి. ఆ పార్టీ ఇష్టం లేదండి. మేం మేధావులమండి అంటారు. కానీ ఏం సాధించారయ్యా మీరు నోటాకు వేసి? అలాంటపుడు నువ్వు పాస్ పోర్టు కూడా చింపేసుకో. నాకీ దేశం నచ్చలేదని. అన్నీ తీసేసుకుంటావు ప్రయోజనాలు. అది మేధావుల సంకుచిత దృష్టి వాదన. ఉన్నోళ్లలో ఈ వ్యక్తి, ఆ వ్యక్తి, ఇలా పదిమంది ఉన్నారంటే అందులో ఎవరో ఒకరికి ఓటు వెయ్యి.

ఓడిపోయేవాడికి ఓటు వేస్తే ఓటు వేస్టయిపోతుందన్నది వీళ్లు చేసే వాదన. అప్పుడు మాత్రం వచ్చేస్తుంది ఓటు వేస్టయిపోతుందనే మాట. మొన్నటి ఎన్నికల్లో 4 శాతం, అంటే 10 లక్షల మంది నోటాకు ఓటు వేశారు. వీళ్లంతా ఎవరి మీద చూపిస్తారు కోపం. అత్తమీద కోపం దుత్త మీద చూపిస్తారా? ఓటు వస్తే మనకు హక్కు వస్తుంది. మార్పు కోసం చూస్తున్న వాళ్లు జనసేనకు ఓటు వేస్తే భీమిలి లాంటి చోట సందీప్ పంచకర్లకు ఓటు వేస్తే.. అతణ్ని ప్రశ్నించే హక్కు వస్తుంది. ఇలా నోటాకు ఓటు వేసిన వాళ్ల వల్లే క్రిమినల్స్ రాజ్యాలేలుతున్నారు. మీరు పరోక్షంగా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి ఎక్కువమంది ఓటు వేయడానికి రండి. ఎవరికో ఒకరికి ఓటు వేయండి” అని పవన్ జనసేన సమావేశంలో పేర్కొన్నాడు.

This post was last modified on October 31, 2022 5:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

21 minutes ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

31 minutes ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

2 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

3 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

4 hours ago