ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కీలకమైన పార్లమెంటు స్థానం నరసాపురం. ఇక్కడ రాజుల హవా ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికలు ముందు అంటే 2014లోబీజేపీ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుగుర్రం ఎక్కింది. ఇక, బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా టీడీపీ ఈ స్థానాన్ని ఆ పార్టీకే ఇచ్చేసిన హిస్టరీ ఉంది. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నా.. పార్లమెంటు స్థాయిలో మాత్రం టీడీపీ పెద్దగా పుంజుకున్నదాఖలా లేదు. గత ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ టికెట్ను మెగా బ్రదర్ నాగబాబుకు కేటాయించారు.
వాస్తవానికి నాగబాబుకుఅదే తొలి ఎన్నిక అందునా క్షత్రియ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన పోటీ మరింత ఆసక్తిగా మారింది. గట్టిపోటీ ఇస్తారులే అనుకుంటే ఆయన పెద్దగా పోటీ ఇవ్వలేక పోయారు. ఈ క్రమంలో 2 లక్షల 50 వేల ఓట్లు సాధించారు. అయితే, వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామకు 4లక్షల 47 వేల ఓట్లు వస్తే, టీడీపీకి రెండో స్థానం దక్కింది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన శివరామరాజుకు 4 లక్షల 15 వేల ఓట్లు వచ్చాయి. దీంతో నాగబాబు థర్డ్ ప్లేస్కు జారి పోయారు. ఇక, ఆ తర్వాత పెద్దగా ఆయన నియోజకవర్గంలో పర్యటించింది లేదు.
అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఓడిన చోటే గెలవాలనే పట్టుతో ఉన్నారని తెలుస్తోంది.ఇటీవల విశాఖ పర్యటనకు కూడా నాగబాబు వచ్చారు. ఇదిలా వుంటే, తాజాగా నరసాపురం టికెట్మళ్లీ నాగబాబుకే కేటాయించినట్టు తెలుస్తోంది. నేరుగా పవన్ ఈ విషయాన్ని చెప్పకపోయినా.. తాజాగా జరిగిన పీఏసీ సమావేశంలో పశ్చిమ గోదావరి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో ఈ జిల్లాలో ఉన్న ఏకైక నియోజక వర్గంలో వైసీపీ దూకుడు ఎక్కువగా ఉందని కనీసం తమను బ్యానర్లు కూడా కట్టనివ్వడం లేదని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ.. అదంతా నాగబాబు చూసుకుంటాడులే. త్వరలోనే ఆయన వస్తారు. అని చెప్పారట. దీంతో ఈ టికెట్ను ఆయనకే కేటాయించే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో చర్చసాగుతుండడం గమనార్హం. అయితే, ఆయన గత అనుభవాల దృష్ట్యా ఇప్పటి నుంచి లైన్క్లియర్ చేసుకునేలా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. పైగా క్షత్రియ వర్గాన్ని మెప్పించాలి. కాపు ఓట్లు ఉన్నా.. డామినేషన్ మాత్రం క్షత్రియులదే కావడం గమనార్హం. మరి నాగబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 31, 2022 12:57 pm
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…