మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలవాలి. అన్నగా, సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా బహిరంగంగా తమ్ముడి గెలుపుకు పనిచేయలేరు. అందుకనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్లాన్ చేసినట్లున్నారు. ఎలాగూ ఈయనకు కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యంలేదు. అందుకనే కాంగ్రెస్ గెలవదని, ఓడిపోయేపార్టీ తరపున ప్రచారం దేనికంటు ఆస్ట్రేలియాలో తనను కలిసిన వాళ్ళతో కావాలనే కామెంట్ చేశారు.
ఆయన అంచనా వేసినట్లే ఎంపీపై ఫిర్యాదులు వెళ్ళగానే వెంటనే అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. సమాధానం చెప్పటానికి పదిరోజులు గడువిచ్చింది. షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానమిస్తారని కూడా ఎవరూ అనుకోవటంలేదు. ఎందుకంటే తనకు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసిందనే నెపంతో పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అసలు అధిష్టానం తనకు నోటీసు ఎప్పుడిస్తుందా అని ఎంపీ ఎదురుచూస్తున్నట్లున్నారు.
అన్నదమ్ములిద్దరు మాట్లాడుకుని ప్లాన్ ప్రకారమే ముందు తమ్ముడు కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామాచేసి బీజేపీలో చేరారు. మునుగుడో ఉపఎన్నికలో తమ్ముడు గెలిస్తే అన్నకూడా బీజేపీలోకి వెళిపోతారు. లేకపోతే అప్పుడు ఏమిచేయాలో ఆలోచిస్తారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం గ్యారెంటీగా చెప్పచ్చు. అదేమిటంటే పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు ఎంపీ రేవంత్ తో గొడవలుపడుతునే ఉంటారు. ఆయన ప్రశాంతంగా ఉండరు, ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయరు.
ఉప ఎన్నిక రిజల్టుతో సంబంధం లేదని అనుకునుంటే సోటీసుకు సమాధానంగా పార్టీకి రాజీనామా లేఖ పంపించే అవకాశాలున్నాయి. బీజేపీలోచేరి కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి పూర్తిస్ధాయిలో పనిచేస్తారు. అప్పుడుకానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కెపాసిటి ఏమిటో జనాలకు తెలీదు. ఎందుకంటే పార్టీకన్నా తామే గొప్పవాళ్ళమన్న ఉద్దేశ్యంతోనే పార్టీలో ఉంటునే బ్రదర్స్ కంపుచేస్తున్నారు. తమమీద తమకు బాగా నమ్మకున్న కారణంగానే ముందు తమ్ముడు పార్టీ వదిలేశారు. ఇపుడు ఎన్నికలో ఓడిపోతే అప్పుడు తెలిసొస్తుంది తమ కెపాసిటి ఏమిటో ?
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…