మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలవాలి. అన్నగా, సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా బహిరంగంగా తమ్ముడి గెలుపుకు పనిచేయలేరు. అందుకనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్లాన్ చేసినట్లున్నారు. ఎలాగూ ఈయనకు కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యంలేదు. అందుకనే కాంగ్రెస్ గెలవదని, ఓడిపోయేపార్టీ తరపున ప్రచారం దేనికంటు ఆస్ట్రేలియాలో తనను కలిసిన వాళ్ళతో కావాలనే కామెంట్ చేశారు.
ఆయన అంచనా వేసినట్లే ఎంపీపై ఫిర్యాదులు వెళ్ళగానే వెంటనే అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. సమాధానం చెప్పటానికి పదిరోజులు గడువిచ్చింది. షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానమిస్తారని కూడా ఎవరూ అనుకోవటంలేదు. ఎందుకంటే తనకు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసిందనే నెపంతో పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అసలు అధిష్టానం తనకు నోటీసు ఎప్పుడిస్తుందా అని ఎంపీ ఎదురుచూస్తున్నట్లున్నారు.
అన్నదమ్ములిద్దరు మాట్లాడుకుని ప్లాన్ ప్రకారమే ముందు తమ్ముడు కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామాచేసి బీజేపీలో చేరారు. మునుగుడో ఉపఎన్నికలో తమ్ముడు గెలిస్తే అన్నకూడా బీజేపీలోకి వెళిపోతారు. లేకపోతే అప్పుడు ఏమిచేయాలో ఆలోచిస్తారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం గ్యారెంటీగా చెప్పచ్చు. అదేమిటంటే పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు ఎంపీ రేవంత్ తో గొడవలుపడుతునే ఉంటారు. ఆయన ప్రశాంతంగా ఉండరు, ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయరు.
ఉప ఎన్నిక రిజల్టుతో సంబంధం లేదని అనుకునుంటే సోటీసుకు సమాధానంగా పార్టీకి రాజీనామా లేఖ పంపించే అవకాశాలున్నాయి. బీజేపీలోచేరి కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి పూర్తిస్ధాయిలో పనిచేస్తారు. అప్పుడుకానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కెపాసిటి ఏమిటో జనాలకు తెలీదు. ఎందుకంటే పార్టీకన్నా తామే గొప్పవాళ్ళమన్న ఉద్దేశ్యంతోనే పార్టీలో ఉంటునే బ్రదర్స్ కంపుచేస్తున్నారు. తమమీద తమకు బాగా నమ్మకున్న కారణంగానే ముందు తమ్ముడు పార్టీ వదిలేశారు. ఇపుడు ఎన్నికలో ఓడిపోతే అప్పుడు తెలిసొస్తుంది తమ కెపాసిటి ఏమిటో ?
This post was last modified on October 25, 2022 11:32 am
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…