Political News

గ‌తం గుర్తు చేస్తున్న టీడీపీ న‌యా గేమ్‌… వైసీపీకి చుక్క‌లేనా!

టీడీపీ వ్యూహాలు అదిరిపోతున్నాయా?వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే క్ర‌మంలో సామ‌దాన బేధ దండోపాయాల‌ను ప్ర‌యోగించే దిశ‌గా టీడీపీ రెడీ అయిందా.? అంటే.. ఔననే అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఒక‌వైపు.. వైసీపీపై యుద్ధం చేస్తూనే.. మ‌రోవైపు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. జన‌సేన‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. ఇక‌, క‌లిసి వ‌చ్చే పార్టీలు రావాల‌ని కూడా.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే.. వైసీపీపై యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేలా ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే గుర్తు చేయాల‌ని టీడీపీ అధినేత ప‌క్కా స్కెచ్ సిద్ధం చేశార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. రాష్ట్రంలో చోటు చేసుకున్న కీల‌క ప‌రిణామాల‌ను గుదిగుచ్చి.. త‌క్కువ నిడివితో ఎక్కువ‌గా ఆలోచించేలా.. వీడియోలు రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది. దీనికి టీడీపీలోని ఐటీ విభాగం 24 గంట‌లు క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు నుంచి నిత్యం ఈ వీడియోల‌ను పుంఖాను పుంఖాలుగా.. సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు.

“మ‌నం మ‌రిచిపోయిన వైసీపీ దాష్టీకాలు” టైటిల్‌తోనే వీడియోలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీటి క‌ర‌క‌ట్ట‌పై ప్ర‌జావేదిక‌ను కూల్చివేసిన ఘ‌ట‌న.. రైతుల‌పై పోలీసులు చేసిన లాఠీ చార్జి… రైతుల ఉద్య‌మాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానికి అనుకూలంగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. అసెంబ్లీలో జ‌గ‌న్ మ‌డ‌మ తిప్ప‌డాలు.. శాస‌న మండ‌లి ర‌ద్దు.. మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై చేసిన కామెంట్లు.. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు విల‌పించ‌డం.. వంటి కీల‌క అంశాల‌ను సిరీస్‌గా రూపొందిస్తున్నారు.

అదేస‌మ‌యంలో హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ ఎపిసోడ్‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకురానున్నారు. దీనిపై ప్ర‌భుత్వం ముందు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పి.. త‌ర్వాత‌.. చేతులు ఎత్తేసిన విష‌యం.. కూడా ప్ర‌స్తావిస్తారు. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినందుకు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిపిన దాడి ఘ‌ట‌న‌లు.. ప‌ల్నాడులో టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డ‌.. మాచ‌ర్ల ఎమ్మెల్యే ఉదంతం… చంద్ర‌బాబు ఇంటిపై.. జోగి ర‌మేష్ దాడికి య‌త్నం.. భారీ ఎత్తున గంజాయి ప‌ట్టుకోవ‌డాలు.. బూతులు తిట్టిన నేత‌లు.. మాద‌క ద్ర‌వ్యాల‌కు కేంద్రంగా ఏపీ మార‌డం.. ఇలా.. విభాగాల వారీగా.. ప్ర‌జ‌లు దాదాపు మ‌రిచిపోయిన అన్ని సంగ‌తుల‌ను రికార్డు చేసిన‌.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వీటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తెస్తోంద‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 23, 2022 8:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేతనంతోనూ సేవ.. పవన్ కే సాధ్యం

అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా…

59 minutes ago

మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి: చంద్ర‌బాబు పిలుపు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి బ‌హిరంగ వేదిక‌పై స్వ‌ల్ప ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి!' అని…

1 hour ago

పాకిస్థాన్‌లో అంత‌ర్యుద్ధం.. హెహ‌బాజ్ చుట్టూ ఉచ్చు!

భార‌త్‌ను ఢీ కొంటామ‌ని.. త‌గిన విధంగా బుద్ది చెబుతామ‌ని బీరాలు ప‌లికిన పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ చుట్టూ…

1 hour ago

కొత్త కబుర్లు పంచుకున్న న్యాచురల్ స్టార్

హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా రెండో వారంలోకి అడుగు…

1 hour ago

మాయమైన వైవీఎస్.. మళ్లీ వచ్చారు

టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…

12 hours ago

మహాభారతం పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారా

ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…

13 hours ago