Political News

గ‌తం గుర్తు చేస్తున్న టీడీపీ న‌యా గేమ్‌… వైసీపీకి చుక్క‌లేనా!

టీడీపీ వ్యూహాలు అదిరిపోతున్నాయా?వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే క్ర‌మంలో సామ‌దాన బేధ దండోపాయాల‌ను ప్ర‌యోగించే దిశ‌గా టీడీపీ రెడీ అయిందా.? అంటే.. ఔననే అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఒక‌వైపు.. వైసీపీపై యుద్ధం చేస్తూనే.. మ‌రోవైపు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. జన‌సేన‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. ఇక‌, క‌లిసి వ‌చ్చే పార్టీలు రావాల‌ని కూడా.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే.. వైసీపీపై యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేలా ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే గుర్తు చేయాల‌ని టీడీపీ అధినేత ప‌క్కా స్కెచ్ సిద్ధం చేశార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. రాష్ట్రంలో చోటు చేసుకున్న కీల‌క ప‌రిణామాల‌ను గుదిగుచ్చి.. త‌క్కువ నిడివితో ఎక్కువ‌గా ఆలోచించేలా.. వీడియోలు రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది. దీనికి టీడీపీలోని ఐటీ విభాగం 24 గంట‌లు క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు నుంచి నిత్యం ఈ వీడియోల‌ను పుంఖాను పుంఖాలుగా.. సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు.

“మ‌నం మ‌రిచిపోయిన వైసీపీ దాష్టీకాలు” టైటిల్‌తోనే వీడియోలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీటి క‌ర‌క‌ట్ట‌పై ప్ర‌జావేదిక‌ను కూల్చివేసిన ఘ‌ట‌న.. రైతుల‌పై పోలీసులు చేసిన లాఠీ చార్జి… రైతుల ఉద్య‌మాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానికి అనుకూలంగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. అసెంబ్లీలో జ‌గ‌న్ మ‌డ‌మ తిప్ప‌డాలు.. శాస‌న మండ‌లి ర‌ద్దు.. మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై చేసిన కామెంట్లు.. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు విల‌పించ‌డం.. వంటి కీల‌క అంశాల‌ను సిరీస్‌గా రూపొందిస్తున్నారు.

అదేస‌మ‌యంలో హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ ఎపిసోడ్‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకురానున్నారు. దీనిపై ప్ర‌భుత్వం ముందు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పి.. త‌ర్వాత‌.. చేతులు ఎత్తేసిన విష‌యం.. కూడా ప్ర‌స్తావిస్తారు. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినందుకు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిపిన దాడి ఘ‌ట‌న‌లు.. ప‌ల్నాడులో టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డ‌.. మాచ‌ర్ల ఎమ్మెల్యే ఉదంతం… చంద్ర‌బాబు ఇంటిపై.. జోగి ర‌మేష్ దాడికి య‌త్నం.. భారీ ఎత్తున గంజాయి ప‌ట్టుకోవ‌డాలు.. బూతులు తిట్టిన నేత‌లు.. మాద‌క ద్ర‌వ్యాల‌కు కేంద్రంగా ఏపీ మార‌డం.. ఇలా.. విభాగాల వారీగా.. ప్ర‌జ‌లు దాదాపు మ‌రిచిపోయిన అన్ని సంగ‌తుల‌ను రికార్డు చేసిన‌.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వీటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తెస్తోంద‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 23, 2022 8:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago