ఆది నుంచి కూడా సినిమా నటులపై రాజకీయ నాయకులకు ఒక చులకన భావం ఉంది. నటులు ఏం చేస్తారులే.. అని. అయితే.. ఈవిషయంలో అన్నగారు ఎన్టీఆర్ తన సత్తా చూపించారు. తెలుగు నాట.. సినిమాల నుంచివచ్చి అధికారం చేపట్టారు. తర్వాత..ఈ రేంజ్లో రాజకీయాలు చేసిన వారు లేరు. అందుకే.. బహుశ ఈ మాట నిలబడిపోయి ఉంటుంది. అయితే.. సినిమా నటులు.. ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలరని.. తాజాగా.. ‘కాంతార’ మూవీ నిరూపించింది. కొన్ని దశాబ్దాలుగా పట్టించుకోని సమస్యను ప్రభుత్వం పట్టించుకునేలా చేసి.. కొన్ని వేల మంది కుటుంబాల్లో కాంతులు నింపింది.
కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను’కాంతార’ సినిమా తెరపై చూపించిన తీరు మెప్పుపొందుతోంది. అయితే.. అదేసమయంలో ఆ ఆదివాసీ సమస్యలను కూడా పరిష్కరించింది. సినిమా విషయంలో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.
‘దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు’ అని పీసీ మోహన్ పేర్కొన్నారు. సో.. సినిమా కేవలం వినోద వస్తువే కాదు.. ప్రభుత్వాలను నిర్దేశించగల వస్తువని కాంతార నిరూపించిందని అంటున్నారు పరిశీలకులు.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…