ఆది నుంచి కూడా సినిమా నటులపై రాజకీయ నాయకులకు ఒక చులకన భావం ఉంది. నటులు ఏం చేస్తారులే.. అని. అయితే.. ఈవిషయంలో అన్నగారు ఎన్టీఆర్ తన సత్తా చూపించారు. తెలుగు నాట.. సినిమాల నుంచివచ్చి అధికారం చేపట్టారు. తర్వాత..ఈ రేంజ్లో రాజకీయాలు చేసిన వారు లేరు. అందుకే.. బహుశ ఈ మాట నిలబడిపోయి ఉంటుంది. అయితే.. సినిమా నటులు.. ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలరని.. తాజాగా.. ‘కాంతార’ మూవీ నిరూపించింది. కొన్ని దశాబ్దాలుగా పట్టించుకోని సమస్యను ప్రభుత్వం పట్టించుకునేలా చేసి.. కొన్ని వేల మంది కుటుంబాల్లో కాంతులు నింపింది.
కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను’కాంతార’ సినిమా తెరపై చూపించిన తీరు మెప్పుపొందుతోంది. అయితే.. అదేసమయంలో ఆ ఆదివాసీ సమస్యలను కూడా పరిష్కరించింది. సినిమా విషయంలో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.
‘దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు’ అని పీసీ మోహన్ పేర్కొన్నారు. సో.. సినిమా కేవలం వినోద వస్తువే కాదు.. ప్రభుత్వాలను నిర్దేశించగల వస్తువని కాంతార నిరూపించిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 21, 2022 7:34 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…