తాజాగా టీడీపీతో చేతులు కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదంతం.. ఏపీ బీజేపీలో.. సెగలు పుట్టిస్తోంది. ఏమాత్రం ఓటు బ్యాంకులేని.. బీజేపీకి అండగా ఉండేందుకు సిద్ధమైన పవన్ను.. ఉద్దేశ పూర్వకంగానే బయటకు పంపించారనే చర్చ.. బీజేపీలో జరుగుతుండడం గమనార్హం.దీనికి కర్త, కర్మ, క్రియ కూడా.. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజే అనే భావన వినిపిస్తోంది. తాజాగా దీనిపై ఓ మీడియాతో మాట్లాడిన బీజేపీ మాజీ అధ్యక్షుడు.. కన్నా లక్ష్మీనారాయణ ఆచి తూచి వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యాఖ్యలు.. హీటెక్కిస్తున్నాయి.
“బీజేపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ను సక్రమంగా కో ఆర్డినేట్ చేయడంలో మా రాష్ట్ర నాయకత్వం.. ఫెయిలైందని చెప్పడంలో నేను ఒప్పుకొంటాను. ఈ విషయంలో నాకు మరో ఆలోచనలేదు. గతంలో అంతర్గతంగా అనుకునేవాడిని..ఇప్పుడు బయటకు చెబుతున్నా. ఆయనతో కలిసి నడిచే విషయంలో రాష్ట్ర నేతలు విఫలమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ నేతలు రంగంలోకి దిగి.. సరిదిద్దుతారేమో.. చూడాలి. వాస్తవానికి ఈ గ్యాప్ను గతంలోనే కేంద్ర నాయకత్వం గుర్తించి.. జాతీయ నాయకుడు.. మురళీధరన్కు సరిదిద్దే బాధ్యత అప్పగించినట్టు తెలిసింది“ అని కన్నా అన్నారు.
అంతేకాదు.. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని పంచుకునేవాళ్లమని, ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకుని.. విషయాలపై చర్చించుకునే వాళ్లమని చెప్పారు. అయితే.. ప్రస్తుతం సోము వీర్రాజు ఒక్కరే.. `ఓన్లీ వన్`గా వ్యవహరిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. దీంతో మాకు విషయాలు తెలియడం లేదు. ఆయన ఎవరితోనూ.. ఏమీ పంచుకోవడం లేదు. కనీసం కోర్ కమిటీలోనూ .. చర్చించడం లేదు. అయితే.. కోఆర్డినేషన్ మాత్రం లేదు. అంతేకాదు.. అసలు ఢిల్లీలో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో.. కూడా తెలియడం లేదన్నారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం.. సోము కు బాగానే సెగ పెట్టేట్టుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 19, 2022 4:16 pm
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…
ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…