ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మంగళవారం వేగంగా మారిపోయాయి. ఇప్పటిదాకా సాత్వికంగా మాట్లాడుతూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్యాకేజీ, మూడు పెళ్లిళ్లు.. ఇలా వైసీపీ వాళ్లు తనను టార్గెట్ చేసే అంశాల మీద తిరుగులేని సమాధానం చెప్పాడు. దీనికే వైసీపీ వాళ్లు గింజుకుంటుంటే.. తర్వాత ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది.
విశాఖలో పవన్ కళ్యాణ్ను రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ, పవన్కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వచ్చారు. పవన్ను కలిశారు. తర్వాత పవన్ సమక్షంలోనే మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గంటకు పైగా పవన్తో చంద్రబాబు సమావేశం కావడం, ఆ తర్వాత ఆయన తరఫున మీడియాతో మాట్లాడ్డం చూస్తే ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవబోతోందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఐతే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఎప్పటికీ సొంతంగా ఎదగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం పవన్కు తెలియనిది కాదు. అయినా సరే.. ఆయన పొత్తుకు సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఇందుకు పరోక్షంగా జగన్ సర్కారే కారణమని చెప్పక తప్పదు. జనసేన తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా వైసీపీ సర్కారు అడ్డం పడుతోంది. ఆయన పర్యటనల్ని అడ్డుకుంటోంది. దీంతో వైసీపీని ఎదుర్కోవడం జనసేనను ఎదుర్కోవడం కొంచెం కష్టమవుతోంది.
పవన్ను స్వేచ్ఛగా వదిలేస్తే జనాల్లోకి వెళ్లేవాడు. పార్టీ కార్యక్రమాలు చేసుకునేవాడు. సొంతంగా పోటీకి సై అన్నా అనేవాడు. కానీ పదే పదే ఆయన్ని ఇబ్బంది పెట్టి తీవ్ర అసహనానికి గురి చేయడం, వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడడం, అరాచకంగా వ్యవహరిస్తుండడంతో తాను ఎదగడం కంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే పవన్కు టార్గెట్గా మారిపోయింది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా ఆలోచించి ఈసారి కచ్చితంగా ఆయన ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిందే పవన్ ఫిక్సయినట్లు కనిపిస్తోంది. పవన్ ఈ నిర్ణయానికి రావడానికి కచ్చితంగా జగన్ అండ్ కోనే కారణం అని చెప్పాలి. తద్వారా జగన్ సర్కారు తనకు తనే నష్టం చేసుకుంటోందని భావించాలి.
This post was last modified on October 19, 2022 6:24 am
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…