Political News

ఇక‌, తేల్చుకోవాల్సింది బీజేపీనే?!

ఔను.. ఇక‌, ఏపీలో ఎవ‌రితో క‌లిసి అడుగులు వేయాలి? అనే విష‌యాన్ని బీజేపీనే తేల్చుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో పొత్తు ఉంద‌ని.. ఆ పార్టీతో నే క‌లిసిన‌డుస్తామ‌ని.. నిన్న‌టి వ‌ర‌కు చెప్పిన బీజేపీ.. ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అయిపోయింది. ఎందుకంటే.. ప‌వ‌నే స్వ‌యంగా చెప్పారు.. నేను అనేక సార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఇంకా వేచి చూస్తే.. మా ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డేలా ఉంద‌ని అన్నారు. అంతేకాదు.. ఇంకా వేచి చూసే ప‌రిస్థితి లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉరుములు లేని పిడుగులా.. వెళ్లి..టీడీపీ అదినేత‌ చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు.

అయితే.. తాను బేటీ అయింది ఎన్నిక‌ల‌కు సంబందించిన విష‌యంపై కాద‌ని.. రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌ను చూస్తూ ఉండ‌లేక‌.. స‌మైక్యంగా పోరాడాల‌నే ఉద్దేశంతోనేన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి రావాల‌ని.. కోరుతున్నాన‌ని చెప్పారు. వారు బీజేపీ అయినా..క‌మ్యూనిస్టులు అయినా.. వైసీపీయేత‌ర ఏ పార్టీ అయినా.. క‌లుపుకొని ముందుకు సాగుతామ‌న్నారు. దీంతో బీజేపీ విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ఎందుకంటే.. తాము ప‌వ‌న్‌తో పొత్తుతో ఉన్నామ‌ని.. చంద్ర‌బాబుతోను.. టీడీపీతోను.. క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం లేద‌నిచెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ కు సంఘీభావం కూడా తెలిపారు.

అయితే.. అనూహ్యంగా ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. చంద్ర‌బాబు విష‌యంలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక నిర్ణ‌యం తీసుకోలేద‌నేది వాస్త‌వం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. పార్టీని చంద్ర‌బాబును కూడా వ్య‌తిరేకించారు. అయితే.. ఇప్పుడు త‌మ‌కు ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారుగా ఉన్న ప‌వ‌నే వెళ్లి చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. అనివార్య ప‌రిస్థితి బీజేపీ ముందుకు వ‌చ్చింది. 2014లో జ‌రిగిన పొత్తుల మాదిరిగానే ఇప్పుడు కూడా.. చేతులు క‌లిపితేనే మంచిద‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. సోము వీర్రాజు వంటి క‌ర‌డుగ‌ట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు మాత్రం టీడీపీతో త‌మ‌కు ప‌నిలేద‌ని.. అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ పోత్తుల బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టేశారు. మ‌రి క‌మ‌ల‌నాథులు ఏం తేల్చుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

సేనానికి అభిమానం అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

7 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

11 minutes ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

1 hour ago

తెలుగోళ్లు గిచ్చితే కానీ… తమిళ సినిమా మారలేదు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…

2 hours ago

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

4 hours ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

6 hours ago