ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబుతో పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణపై దృష్టి పెట్టారు.
పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని నేరుగా నోవాటెల్ హోటల్కు వచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా హోటల్కు చేరుకోగానే పవన్, నాగబాబు, నాదెండ్ల ఆయన సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. అలాగే పొత్తు దిశగా చంద్రబాబు – పవన్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతుందని.. బీజేపీకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి చంద్రబాబుతో పవన్ ఫోన్లో మాట్లాడారు. ఐదేళ్ల తరువాత తొలిసారి చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు.
This post was last modified on October 18, 2022 6:08 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…