ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబుతో పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణపై దృష్టి పెట్టారు.
పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని నేరుగా నోవాటెల్ హోటల్కు వచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా హోటల్కు చేరుకోగానే పవన్, నాగబాబు, నాదెండ్ల ఆయన సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. అలాగే పొత్తు దిశగా చంద్రబాబు – పవన్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతుందని.. బీజేపీకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి చంద్రబాబుతో పవన్ ఫోన్లో మాట్లాడారు. ఐదేళ్ల తరువాత తొలిసారి చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు.
This post was last modified on October 18, 2022 6:08 pm
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…
ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…
టీ20 ప్రపంచకప్లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…
సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…