Political News

బీజేపీతో పొత్తుపై పవన్ హాట్ కామెంట్స్

ఏపీలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పవన్ కు చెడిందని, అందుకే, బీజేపీ చేపట్టిన కార్యక్రమాలలో పవన్ కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన పవన్…బీజేపీతో వ్యవహారంపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు.

బీజేపీతో జనసేనకు పొత్తు ఉందని, అయినప్పటికీ ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ ఉందన్న విషయం తమకూ, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని పవన్ అన్నారు. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకే తాను రోడ్ మ్యాప్ అడిగానని, కానీ, వారు ఆ రోడ్ మ్యాప్ పై స్పందించకపోవడం వల్ల తనకు టైం వేస్ట్ అవుతోందని పవన్ చెప్పారు.

అయితే, తనకు పదవుల మీద వ్యామోహం లేదన్న పవన్…రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను ఎప్పటికపుడు మార్చుకోవాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీతో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని పవన్ అన్నారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని, కానీ, ఊడిగం చేయలేమని పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి.

పవన్ మంగళగిరిలో ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు పవన్ కు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు రావడంతో బీజేపీ, జనసేనల పొత్తు సజీవంగా ఉందని అంతా అనుకున్నారు. పవన్ కు సోము సంఘీభావం ప్రకటించడం, విశాఖలో వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని సోము ఆరోపించడంతో పవన్ తో బీజేపీ ప్యాచప్ చేసుకుందని భావించారు.

మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ తో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని సోము చెప్పడంతో ఈ రెండు పార్టీలు ఇకపై కలిసి పని చేస్తాయని అనుకున్నారు. కానీ, సోము కామెంట్ల తర్వాత కూడా బీజేపీతో పొత్తుపై ఊడిగం చేయబోమంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాజాగా పవన్ కామెంట్లతో బీజేపీతో జనసేన పొత్తు ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on October 18, 2022 6:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సోషల్ మీడియాలో పాయల్ ఆవేదన

పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…

54 mins ago

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ…

2 hours ago

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ…

3 hours ago

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం…

5 hours ago

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని..…

7 hours ago

మూడో భారతీయుడు షాక్ ఇస్తాడా

అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…

14 hours ago