వందల మాటల్లో చెప్పలేని.. భావాన్ని.. ఒక్క ఫొటో ప్రతిబింబిస్తుందని అంటారు. ఇప్పుడు ఓ ఫొటో.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైరల్ అవుతోంది. దాదాపు అందరి సెల్ ఫోన్లలోనూ.. కదలాడుతోంది. అదే.. ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించిన ఫొటో. వాస్తవానికి రైతులు మహాపాదయాత్ర 2.0 ను ప్రారంభించి 37 రోజులు అయింది. ఈ క్రమంలో అనేక ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ ఫొటో మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఈ ఫొటో కేవలం రాజధానిపై ఆకాంక్షనే కాదు.. ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది.
నిండి గర్భవతి అయిన మహిళ.. ఒక చేతిలో రాజధాని రైతుల ఆకాంక్ష..రాష్ట్ర ఆకాంక్ష అయిన.. అమరావతికి చిహ్నంగా గ్రీన్ బెలూన్ల బొకేను పట్టుకుని.. అదే చేత్తో మంచినీళ్ల బాటిల్ను కూడా.. పట్టుకుని.. ఇంకో చేత్తో.. చిన్నారిని తీసుకుని పాదయాత్రలో అడుగులు కదుపుతున్నారు. సాధారణంగా రాజధాని కోసం.. ఎందరో పాదం కదుపుతున్నారు. రాజధాని నినాదాన్ని పలుకుతున్నారు. పాదయాత్రకు వెళ్లలేని వారు.. మరో రూపంలో తమ మద్దతు ప్రకటిస్తు న్నారు. ఇంకొందరు మాత్రం ఏం వెళ్తాంలే.. గురూ.. అని బద్ధకిస్తున్నారు.
అయితే.. నిండు గర్భిణిగా ఉన్న ఈ మహిళ మాత్రం పాదయాత్ర రివ్వున సాగిపోతున్నా… తాను కిలో మీటర్ల దూరం వెనకబడిపోతున్నా.. మౌనంగా.. అడుగులో అడుగు వేస్తూ.. కడుపులో ఒక చిన్నారిని.. చేతిలో మరో చిన్నారిని మోస్తూ.. రాజధాని ఆకాంక్షను వెల్లడిస్తున్న తీరు అందరినీ అబ్బుర పరుస్తోంది. రాజధాని సంకల్పం.. అమరావతినే రాజధానిగా చూడాలనే సంకల్పం.. ఆమెలో నరనరానా జీర్ణించుకుపోయిన.. తీరు.. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మరి.. ఈ ఫొటో చూసిన తర్వాత.. మనం మాత్రం జైకొట్టకుండా.. ఉండగలా.. పాదం కదపకుండా.. నిరీక్షించగలమా!!
This post was last modified on October 18, 2022 3:29 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…