వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఖండించారు. తనకు కూడా.. బూతులు మాట్టాడడం వచ్చన్నారు. అయితే.. సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. మంగళవారం.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్నా, ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా ” అంటూ.. తన కాలికి ఉన్న చెప్పు తీసి మరీ చూపించారు.
ఈ సందర్భంగా వైసీపీలోని కాపు నేతలను ఉద్దేశించి కూడా.. పవన్ కీలకవ్యాఖ్యలు చేశారు. కాపు పేరు చెప్పి రాజకీయాలు చేయడం.. తనకు కూడా వచ్చని.. కానీ, కుల రాజకీయాలు చేయకూడదని.. ప్రజల సమస్యలనే రాజకీయంగా చూడాలని భావించానని.. అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని.. అన్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ కాపు వెధవలను కూడా హెచ్చరిస్తున్నానని.. కాపుల గురించి ముందు తెలుసుకోవాలని.. పవన్ సూచించారు.
“నన్ను గొడవల్లోకి లాగితే.. కొట్టి.. గొంతు పిసికి చంపేస్తా” అని కాపు నేతలను పవన్ హెచ్చరించారు. బాపట్లలో పెరిగానని.. గొడ్డు కారం తిన్నానని.. తనకు కూడా.. పౌరుషం ఉందని.. పవన్ వ్యాఖ్యానించారు. “నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా?”అంటూ.. పవన్ సవాల్ విసిరారు. చరిత్ర తెలుసుకోకుండా.. కేవలం బూతుల పంచాంగంతోనే వైసీపీ సన్నాసులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
This post was last modified on October 18, 2022 4:44 pm
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం…
ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని…
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…