వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఖండించారు. తనకు కూడా.. బూతులు మాట్టాడడం వచ్చన్నారు. అయితే.. సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. మంగళవారం.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్నా, ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా ” అంటూ.. తన కాలికి ఉన్న చెప్పు తీసి మరీ చూపించారు.
ఈ సందర్భంగా వైసీపీలోని కాపు నేతలను ఉద్దేశించి కూడా.. పవన్ కీలకవ్యాఖ్యలు చేశారు. కాపు పేరు చెప్పి రాజకీయాలు చేయడం.. తనకు కూడా వచ్చని.. కానీ, కుల రాజకీయాలు చేయకూడదని.. ప్రజల సమస్యలనే రాజకీయంగా చూడాలని భావించానని.. అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని.. అన్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ కాపు వెధవలను కూడా హెచ్చరిస్తున్నానని.. కాపుల గురించి ముందు తెలుసుకోవాలని.. పవన్ సూచించారు.
“నన్ను గొడవల్లోకి లాగితే.. కొట్టి.. గొంతు పిసికి చంపేస్తా” అని కాపు నేతలను పవన్ హెచ్చరించారు. బాపట్లలో పెరిగానని.. గొడ్డు కారం తిన్నానని.. తనకు కూడా.. పౌరుషం ఉందని.. పవన్ వ్యాఖ్యానించారు. “నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా?”అంటూ.. పవన్ సవాల్ విసిరారు. చరిత్ర తెలుసుకోకుండా.. కేవలం బూతుల పంచాంగంతోనే వైసీపీ సన్నాసులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
This post was last modified on October 18, 2022 4:44 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…