Political News

కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కారు మరో వినూత్న ప్రయోగం

కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది.

కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు చేయడం కీలకమని ఏపీ సీఎం అర్థం చేసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు తెప్పించి.. విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇంకా కూడా పరీక్షలు పెంచాలని.. ప్రతి కుటుంబంలోనూ ఒకరికి కచ్చితంగా కరోనా టెస్టు చేయాలని జగన్ సర్కారు సంకల్పించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా కీలక ముందడుగు వేసింది ఏపీ సర్కారు. ‘సంజీవని’ పేరుతో ఆ ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం 50కి పైగా బస్సులను ప్రవేశపెట్టింది. వాటి నమూనాలు కూడా బయటికి వచ్చాయి. ఆ బస్సుల్లో ప్రయాణికుల కోసం పెట్టిన తరహాలో సీట్లు ఉండవు. కరోనీ పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేశారు. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూశారు. కొందరు మెడికల్ సిబ్బంది అందులో ఉండి వచ్చిన వాళ్లందరికీ కరోనా పరీక్షలు చేస్తారు.

జిల్లాకు నాలుగు చొప్పున ఈ బస్సులను కేటాయించారు. ఇవి అన్ని జిల్లాల్లోనూ పట్టణాలతో సహా గ్రామాల్లో తిరిగి ఇంటికి కనీసం ఒకరి చొప్పున కరోనా పరీక్షలు చేసే పనిలో నిమగ్నమవుతాయి. ఇంటికొకరు లెక్కన కనీసం ఏపీలో కోటికి తక్కువ కాకుండా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోవడం ఖాయం.

This post was last modified on July 10, 2020 11:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

2 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

2 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ…

3 hours ago

మొదటిసారి ద్విపాత్రల్లో అల్లు అర్జున్ ?

పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…

3 hours ago

పార్లమెంట్ బరి నుండి ప్రియాంక ఔట్ !

రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…

3 hours ago

కాంతార 2 కోసం కుందాపుర ప్రపంచం

క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…

4 hours ago