కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది.
కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు చేయడం కీలకమని ఏపీ సీఎం అర్థం చేసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు తెప్పించి.. విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇంకా కూడా పరీక్షలు పెంచాలని.. ప్రతి కుటుంబంలోనూ ఒకరికి కచ్చితంగా కరోనా టెస్టు చేయాలని జగన్ సర్కారు సంకల్పించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కీలక ముందడుగు వేసింది ఏపీ సర్కారు. ‘సంజీవని’ పేరుతో ఆ ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం 50కి పైగా బస్సులను ప్రవేశపెట్టింది. వాటి నమూనాలు కూడా బయటికి వచ్చాయి. ఆ బస్సుల్లో ప్రయాణికుల కోసం పెట్టిన తరహాలో సీట్లు ఉండవు. కరోనీ పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేశారు. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చూశారు. కొందరు మెడికల్ సిబ్బంది అందులో ఉండి వచ్చిన వాళ్లందరికీ కరోనా పరీక్షలు చేస్తారు.
జిల్లాకు నాలుగు చొప్పున ఈ బస్సులను కేటాయించారు. ఇవి అన్ని జిల్లాల్లోనూ పట్టణాలతో సహా గ్రామాల్లో తిరిగి ఇంటికి కనీసం ఒకరి చొప్పున కరోనా పరీక్షలు చేసే పనిలో నిమగ్నమవుతాయి. ఇంటికొకరు లెక్కన కనీసం ఏపీలో కోటికి తక్కువ కాకుండా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోవడం ఖాయం.
This post was last modified on July 10, 2020 11:08 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…