మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్పటికి నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికైనా.. కేసును పరిష్కరించి.. తమకు న్యాయం చేయాలని బాధిత వివేకా కుటుంబం కోరుకుంటోంది. అయితే.. పొలీసులు మాత్రం పైకి ఒకవిధంగా.. లోలోన మరో విధంగా వ్యవహరిస్తున్నారని.. సీబీఐ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నిందితులతో పోలీసులు చేతులు కలిపారని.. నిందితులతో పోలీసులు చేతులు కలిపారని కూడా సీబీఐ నేరుగా సుప్రీం కోర్టులోనే పేర్కొనడం సంచలనంగా మారింది.
వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో.. నిందితుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరారు. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూశారని సీబీఐ వాదించింది.
సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ ధర్మాసనం ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 14కి వాయిదా వేసింది. ఇక, ఇప్పటికే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. వివేకా కేసులో ఆది నుంచి అప్రూవర్గామారిన దస్తగిరి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైగా.. ఇదే విషయంపై ఎస్పీకి సైతం.. ఆయన ఫిర్యాదు చేశారు. అయినా.. ఎవరూ కూడా.. ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడు సీబీఐ నేరుగా.. గంగిరెడ్డి వంటివారిపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా.. రక్షణ కలుతుందా.. లేదా చూడాలి.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…