రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు.
ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. మున్ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు చూస్తామనే సంకేతాలే అన్ని అధ్యయనాలూ ఇస్తున్నాయి. తాజాగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) భారత్లో మున్ముందు కరోనా తీవ్రత ఎలా ఉండబోతోందో నిపుణులతో ఒక అధ్యయనం జరిపి దాని వివరాలు వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ కానీ, వైరస్ను తగ్గించే కచ్చితమైన మందులు కానీ రాకపోతే 2021లో చలికాలం ముగిసేసరికి రోజుకు 2.87 లక్షల మంది చొప్పున కరోనా బారిన పడతారని ఎంఐటీ అధ్యయనం అంచనా వేసింది. రోజు వారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా అగ్రస్థానానికి చేరుతుందని కూడా ఆ సంస్థ ప్రకటించింది. ,ఇండియాలో కేసులు, మరణాల వివరాలు ప్రస్తుతం సరిగా అందడం లేదని.. జూన్ 18 నాటి సమాచారం ప్రకారం వాస్తవ కేసులు ప్రకటిస్తున్న దాని కంటే 11.8 రెట్లు, మరణాలు 1.48 రెట్లు ఉండేందుకు ఆస్కారం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.
హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే విషయంలో ప్రస్తుతం ఏ దేశం దగ్గరగా లేదని… దాని కోసం ఎదురు చూడటం మంచిది కాదని ఎంఐటీ స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వృద్ధి రేటు ఉన్న దేశంగా ఇండియా నిలుస్తుండటం ప్రమాదకర సంకేతం. గత వారం రోజుల్లో రోజుకు సగటున 3.5 శాతం మేర కరోనా కేసుల వృద్ధి కనిపించింది ఇండియాలో. ఈ విషయంలో బ్రెజిల్ 2.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. అమెరికా 1.8 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
This post was last modified on July 9, 2020 7:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…