Political News

భారత్‌లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్

రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు.

ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. మున్ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు చూస్తామనే సంకేతాలే అన్ని అధ్యయనాలూ ఇస్తున్నాయి. తాజాగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) భారత్‌లో మున్ముందు కరోనా తీవ్రత ఎలా ఉండబోతోందో నిపుణులతో ఒక అధ్యయనం జరిపి దాని వివరాలు వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్ కానీ, వైరస్‌ను తగ్గించే కచ్చితమైన మందులు కానీ రాకపోతే 2021లో చలికాలం ముగిసేసరికి రోజుకు 2.87 లక్షల మంది చొప్పున కరోనా బారిన పడతారని ఎంఐటీ అధ్యయనం అంచనా వేసింది. రోజు వారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా అగ్రస్థానానికి చేరుతుందని కూడా ఆ సంస్థ ప్రకటించింది. ,ఇండియాలో కేసులు, మరణాల వివరాలు ప్రస్తుతం సరిగా అందడం లేదని.. జూన్ 18 నాటి సమాచారం ప్రకారం వాస్తవ కేసులు ప్రకటిస్తున్న దాని కంటే 11.8 రెట్లు, మరణాలు 1.48 రెట్లు ఉండేందుకు ఆస్కారం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.

హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే విషయంలో ప్రస్తుతం ఏ దేశం దగ్గరగా లేదని… దాని కోసం ఎదురు చూడటం మంచిది కాదని ఎంఐటీ స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వృద్ధి రేటు ఉన్న దేశంగా ఇండియా నిలుస్తుండటం ప్రమాదకర సంకేతం. గత వారం రోజుల్లో రోజుకు సగటున 3.5 శాతం మేర కరోనా కేసుల వృద్ధి కనిపించింది ఇండియాలో. ఈ విషయంలో బ్రెజిల్ 2.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. అమెరికా 1.8 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.

This post was last modified on July 9, 2020 7:46 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

58 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago