పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు.
రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ధిక్కారస్వరం వినిపిస్తున్న సొంత ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకుముందు మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్లు కూడా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు… రఘురామపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా తనపై చర్యలు తీసుకోలేనివిధంగా పక్కా ప్లాన్తో పావులు కదిపిన రఘురామతో జగన్ ఇప్పుడు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన విమర్శలు గుప్పించిన నరసాపురం లోకసభ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేసులు పెట్టిస్తుండటం గమనార్హం.
గతంలో వదిలేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక అధిష్టానం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదివరకే వైసీపీ ఎంపీలు.. రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ లోకసభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఫిర్యాదు వెళ్లింది.
This post was last modified on July 9, 2020 6:08 pm
టాలీవుడ్ గత పుష్కర కాలంలో పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి, పుష్ప లాంటి అసాధారణ విజయాలను చూసింది. కానీ ఇప్పుడు…
`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూటమి పార్టీ టీడీపీ చేపట్టిన కార్యక్రమం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మరో…
ప్యాన్ ఇండియా సినిమాలకు వచ్చే అతి పెద్ద చిక్కు రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఒత్తిడి ఎక్కువైపోవడం. ఆ…
తెలుగులో వచ్చినన్ని కామెడీ సినిమాలు మరే భాషలోనూ రాలేదంటే అతిశయోక్తి కాదు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి…
మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యచరణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.…
బేబీ బ్లాక్ బస్టర్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ వచ్చే వారం సెప్టెంబర్…