ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నిరసన గళాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీకి ఓ తలనొప్పిగా మారిపోతే.. తాజాగా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో నిరసన గళం విప్పారు. అది కూడా జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ధర్మాన తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించి జగన్ ఎంచుకున్న ప్రాతిపదిక తప్పని, ఆ ప్రాతిపదికతో వెళితే.. రాష్ట్రంలో అభివృద్ధి దశాబ్దాల మేర వెనక్కెళ్లినట్టేనని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశం ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లా ప్రాతిపదికన రాష్ట్రంలో ప్రస్తుతమున్న జిల్లాలతో కలిపి మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లుగా విపక్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అనుకున్నట్లుగానే జగన్ కు అధికారం దక్కింది. సీఎం పీఠం ఎక్కేశారు. సీఎంగా జగన్ అప్పుడే ఏడాది పాలనను కూడా ముగించేశారు. అయితే కొత్త జిల్లాల ఊసు అంతగా వినిపించలేదు. తాజాగా ఈ విషయంపై ఓ సమీక్ష సందర్భంగా జగన్ మరోమారు ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు మరోమారు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ సాగుతోంది.
ఇలాంటి క్రమంలో వైసీపీకి చెందిన కీలక నేత, సీనియర్ రాజకీయవేత్త, పాలనలో అపార అనుభవం ఉన్న నేతగా పరిగణిస్తున్న మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ధర్మాన నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు జగన్ ఐడియానే సరికాదన్న రీతిలో వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. అయినా దర్మాన ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన వద్దు. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే… శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కెళ్లిపోతుంది’’ అంటూ దర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on July 8, 2020 10:51 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…