తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఓ వైపు చారిత్రక సెక్రటేరియట్ను కూల్చివేస్తూ భారీ బడ్జెట్తో మరో సచివాలయం నిర్మించేందుకు సన్నద్ధం అవడం… మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల కలకలం కొనసాగుతుండగా దాదాపుగా పది రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక, వ్యక్తిగత కార్యకలాపాల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం! కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఈ రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యాలయమైన ప్రగతిభవన్ వద్ద కొందరు యువకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? ఆయన మా ముఖ్యమంత్రి. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం నా హక్కు‘ అని ఇంగ్లీష్లో ఉన్న ప్లకార్డును ఓ యువకుడు ప్రదర్శించడం కలకలం రేపుతోంది. మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ జాడ కోసం పలువురు హల్ చల్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్రస్ ఎక్కడ? ఆయన క్షేమంగా ఉండాలి అంటూ కొందరు విద్యార్థులు పూజలు చేశారు. తమ సీఎం ఎక్కడున్నా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈ పూజల్లో పాల్గొన్నవారు ఆకాంక్షించారు.
కాగా, సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతిపక్షాలు చేసే కామెంట్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీఎం కెసిఆర్ గట్టిగానే ఉన్నారని, ఆయనది బలమైన గుండె కాయ అని చెప్పుకొచ్చారు. “సీఎం ఎంత గట్టి గా ఉన్నారో మాకు తెలుసు. ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని మంత్రి వెల్లడించారు.ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడుంటే ఏమిటీ? ఏ పథకమైనా ఆగిందా?ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆగిందా? “ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
This post was last modified on July 8, 2020 7:42 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…