Political News

టీటీడీ మాస పత్రికతో పాటు క్రిస్టియన్ మ్యాగజైన్

ఏ ముహూర్తాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిందో కానీ.. అప్పట్నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏదో ఒక రగడ తప్పట్లేదు. టీటీడీ ఛైర్మన్‌గా నియమితుడైన ఎష్వీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్న ప్రచారం దగ్గర్నుంచి.. శ్రీవారి భూముల అమ్మకానికి జీవో ఇవ్వడం వరకు టీటీడీ చుట్టూ ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది.

తిరుమలలో అన్యమత ప్రచారం చేయడం.. టీటీడీ వెబ్ సైట్లో క్రీస్తు సూక్తులు కనిపించడం లాంటి వ్యవహారాలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ఓ శ్రీవారి భక్తుడికి టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటుగా ఓ క్రిస్టియన్ మ్యాగజైన్ కలిపి పోస్టులో రావడం వివాదాస్పదమైంది. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు నెలనెలా టీటీడీ మాస పత్రిక సప్తగిరి తెప్పించుకుంటాడు. ఐతే తాజా పార్శిల్లో ‘సప్తగిరి’తో పాటు ‘సజీవ సువార్త’ అనే క్రిస్టియన్ మ్యాగజైన్ కూడా వచ్చింది.

అది చూసి షాక్ తిన్న ఆ భక్తుడు మీడియాకు సమాచారం అందించాడు. పార్శిల్లోని రెండు మ్యాగజైన్లను విప్పి చూపించాడు. శ్రీవారి భక్తుడైన తనకు క్రిస్టియన్ మ్యాగజైన్ చూసి మనోభావాలు దెబ్బ తిన్నట్లు అతను చెప్పాడు. దీనిపై టీటీడీ అధికారులు వివరణ ఇవ్వాలని కోరాడు. ఐతే తమ వైపు నుంచి తప్పేమీ జరగలేదని.. మధ్యలో ఎవరో దురుద్దేశపూర్వకంగా ఇలా చేశారని టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీ పుస్తకాల్ని పోస్టల్ శాఖే పాఠకులకు చేరవేస్తుంది.

మధ్యలో ఎవరైనా ఇలా పార్శిల్‌లో క్రిస్టియన్‌ మ్యాగజైన్‌ను పెట్టి ఉంటారా.. లేక టీటీడీలోనే ఎవరైనా కావాలనే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. ఐతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైకాపా నేతల్లో చాలామంది క్రిస్టియన్లు కావడంతో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారంతో పాటు మత మార్పిడి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.

This post was last modified on July 8, 2020 3:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirumalaTTD

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago