దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మహమ్మారి తీవ్రత కారణంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఊహించని విధంగా చోటు చేసుకున్న తాజా ఉదంతం సంచలనంగా మారింది. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నివాసమైన ‘రాజగృహ’పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి.
దాదర్ లో ఉండే అంబేడ్కర్ మూడంస్థుల ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దుండగులు.. అక్కడి పూలకుండీల్ని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర హోంశాఖామంత్రి అనిల్ దేశ్ ముఖ్ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉదంతంపై విచారణకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యల్ని చేపట్టారు. అంబేడ్కర్ నివాసమైన ‘రాజగృహ’లో తాను సేకరించిన పుస్తకాల్ని.. సాహిత్యాన్ని పెద్ద ఎత్తున ఉంచేవారు. ఆయన వాడినకొన్ని వ్యక్తిగత వస్తువుల్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తుంటారు.
అంబేడ్కర్ పై పరిశోధనలు చేయాలనుకునే వారికి.. ఈ ఇల్లు ఒక పెద్ద పరిశోధనాలయంగా ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రముఖ భవనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయటం.. ఫర్నీచర్ ను ధ్వంసం చేసే వరకూ పోలీసు వర్గాలు గుర్తించకపోవటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉదంతం రాజకీయ అంశంగా చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత…
పెద్ది టాక్స్, డిస్కషన్ల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏరియాలలో పుష్ప…
రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు…
రాజ రాజ చోర, స్వాగ్ దర్శకుడు హసిత్ గోలి, మాస్ మహారాజ రవితేజ కలయికలో ఒక సినిమా రూపొందబోయే సంగతి…
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఒక ఎడతెగని పంచాయితీగా మారుతోంది. నిర్మాతలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వానికి…
వన్ సైడ్ లవ్ తెలుగు తెరకు కొత్త కాదు. కొన్ని వందల సార్లు చూసుంటాం. కాకపోతే చెప్పే విధానంలో దర్శకులు…