రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. మిగిలిన సీఎంల మాదిరి అదే పనిగా.. మీడియా ముందుకు రావటం లాంటివి చేయరు. ఎవరెంత అనుకున్నా తాను ఎప్పుడైతే రావాలనుకుంటారో అప్పుడు మాత్రమే ప్రెస్ ముందుకు వచ్చి.. ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం ప్రెస్ నోట్ లో వెల్లడించటమే తప్పించి.. ముందుగా సమాచారంఇవ్వటం లాంటివి చేయరు.
మామూలు రోజుల్లో కేసీఆర్ తీరును పెద్దగా ప్రశ్నించేవారు కాదు. దీనికి కారణం తనకు తగ్గట్లుగా ప్రజల్ని.. మీడియాను.. సోషల్ మీడియాను అలవాటు చేసుకున్నారని చెప్పాలి. తాజాగా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అన్నింటికి మించి అంచనాలకు అందని రీతిలో అంతకంతకూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. కేసీఆర్ ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.
మొన్నటి వరకూ నాలుగైదు రోజులకు ఒకసారి దర్శనమిచ్చే ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అస్సలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ట్విట్టర్ లో వేరీజ్ సీఎం కేసీఆర్? పేరుతో ఒక హ్యాష్ టాగ్ తో భారీగా ట్వీట్లు చేశారు. చివరికి అది ఆ రోజు ట్రెండింగ్ హ్యాష్ టాగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా విపక్ష నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? అంటూ సూటిప్రశ్నను సంధించారు.
రోజువారీగా ప్రభుత్వం చెప్పే కేసుల లెక్కకు.. కేసీఆర్ సర్కారు చూపించే లెక్కలకు సంబంధం లేదని ఆరోపించారు. కేసీఆర్ చీకటి కుట్రలో పాలు పంచుకునే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఇరవై మందిని తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయిన సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రికి తొత్తుగా మారారని చెప్పారు.
ఏపీ సీఎం కరోనా విషయంలో అద్భుతంగా పని చేశారని.. అందుకు తగ్గట్లే ఆ రాష్ట్రంలో పది లక్షల పరీక్షలు నిర్వహిస్తే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కేవలం లక్ష పరీక్షలు మాత్రమే జరిగాయని ధ్వజమెత్తారు. కరోనాకు చేసే చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మామూలుగానే డిమాండ్లు చేయటం నచ్చని కేసీఆర్ కు.. తాము కోరినంతనే కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే అవకాశం ఉందంటారా ఉత్తమ్?
This post was last modified on July 8, 2020 11:11 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…