రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. మిగిలిన సీఎంల మాదిరి అదే పనిగా.. మీడియా ముందుకు రావటం లాంటివి చేయరు. ఎవరెంత అనుకున్నా తాను ఎప్పుడైతే రావాలనుకుంటారో అప్పుడు మాత్రమే ప్రెస్ ముందుకు వచ్చి.. ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం ప్రెస్ నోట్ లో వెల్లడించటమే తప్పించి.. ముందుగా సమాచారంఇవ్వటం లాంటివి చేయరు.
మామూలు రోజుల్లో కేసీఆర్ తీరును పెద్దగా ప్రశ్నించేవారు కాదు. దీనికి కారణం తనకు తగ్గట్లుగా ప్రజల్ని.. మీడియాను.. సోషల్ మీడియాను అలవాటు చేసుకున్నారని చెప్పాలి. తాజాగా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అన్నింటికి మించి అంచనాలకు అందని రీతిలో అంతకంతకూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. కేసీఆర్ ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.
మొన్నటి వరకూ నాలుగైదు రోజులకు ఒకసారి దర్శనమిచ్చే ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అస్సలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ట్విట్టర్ లో వేరీజ్ సీఎం కేసీఆర్? పేరుతో ఒక హ్యాష్ టాగ్ తో భారీగా ట్వీట్లు చేశారు. చివరికి అది ఆ రోజు ట్రెండింగ్ హ్యాష్ టాగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా విపక్ష నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? అంటూ సూటిప్రశ్నను సంధించారు.
రోజువారీగా ప్రభుత్వం చెప్పే కేసుల లెక్కకు.. కేసీఆర్ సర్కారు చూపించే లెక్కలకు సంబంధం లేదని ఆరోపించారు. కేసీఆర్ చీకటి కుట్రలో పాలు పంచుకునే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఇరవై మందిని తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయిన సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రికి తొత్తుగా మారారని చెప్పారు.
ఏపీ సీఎం కరోనా విషయంలో అద్భుతంగా పని చేశారని.. అందుకు తగ్గట్లే ఆ రాష్ట్రంలో పది లక్షల పరీక్షలు నిర్వహిస్తే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కేవలం లక్ష పరీక్షలు మాత్రమే జరిగాయని ధ్వజమెత్తారు. కరోనాకు చేసే చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మామూలుగానే డిమాండ్లు చేయటం నచ్చని కేసీఆర్ కు.. తాము కోరినంతనే కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే అవకాశం ఉందంటారా ఉత్తమ్?
This post was last modified on July 8, 2020 11:11 am
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…