Political News

వైఎస్ జయంతి నాడు… బాబుకు జగన్ షాక్?

2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టగా…23 మంది ఎమ్మెల్యేలతో మాజీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. ఆ తర్వాత పరిణామాల మధ్య టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి…పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలైన ఈ ముగ్గురిపై టీడీపీకి ఏమాత్రం హక్కులేదు. ఇక, తాజాగా ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణి, పోతుల సునీత…వైసీపీకి మద్దతిచ్చారు.

ఈ నేపథ్యంలోనే మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు వైఎస్సార్ జయంతి అయిన జులై 8ని జగన్ ముహూర్తంగా ఫిక్స్ చేశారని టాక్ వస్తోంది. వైఎస్ జయంతినాడు బాబుకు జగన్ షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

మరి కొద్ది రోజుల్లో టీడీపీని వీడేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు పార్టీని వీడతారని చాాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, శాసనమండలిలో బలం పెంచుకోవాలని వైసీపీ భావిస్తోందట. అందుకే టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారట.

డొక్కా, శమంతకమణి, పోతుల సునీత తరహాలోనే జులై 8వతేదీన మరో ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు కూడా వారితో పాటు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. వైఎస్ జయంతి నాడు చంద్రబాబుకు షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంపై అప్రమత్తమైన బాబు వీరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on July 7, 2020 5:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

35 minutes ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

1 hour ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

2 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

2 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

4 hours ago

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

13 hours ago