కరోనాపై పోరులో మొదట బాగా విమర్శలు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయన్ని పొగుడుతున్నాయి. తన తప్పులను దిద్దుకున్న జగన్.. ఇప్పుడు కరోనాపై పోరులో సమర్థంగా పని చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయన ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరైన జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆయన్ని అభినందించక తప్పని పరిస్థితి వచ్చింది.
ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రవేశపెట్టడం ద్వారా నేషనల్ మీడియాలో సైతం జగన్ గురించి పాజిటివ్ న్యూస్లు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ట్విట్టర్ వేదికపై జగన్పై ప్రశంసలు కురిపించడం విశేషం.
తమ రాష్ట్రంలో పరిస్థితులను.. ఏపీతో పోలుస్తూ జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు సిద్ధరామయ్య. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య కన్నడ భాషలో ట్వీట్ చేశారు.
ఒక మాజీ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇలా జగన్ మీద ప్రశంసలు కురిపించడంతో వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు ఈ ట్వీట్ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. దటీజ్ జగన్ అంటూ కొనియాడుతున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా జగన్ సర్కారు ఇటీవలే ఒకేసారి 1086 అంబులెన్సులు (108, 104) ప్రారంభించడంతో పాటు గుంటూరులో ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తెచ్చింది.
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…