Political News

జ‌గ‌న్ సూప‌రన్న క‌ర్ణాట‌క మాజీ సీఎం

క‌రోనాపై పోరులో మొద‌ట బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయ‌న్ని పొగుడుతున్నాయి. త‌న త‌ప్పుల‌ను దిద్దుకున్న జ‌గ‌న్.. ఇప్పుడు క‌రోనాపై పోరులో స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న రాష్ట్రాల్లో ఒక‌టిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల్లో ఒక‌రైన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఆయ‌న్ని అభినందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.

ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా నేష‌న‌ల్ మీడియాలో సైతం జ‌గ‌న్ గురించి పాజిటివ్ న్యూస్‌లు వ‌చ్చాయి. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌.. ట్విట్ట‌ర్ వేదిక‌పై జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

త‌మ రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను.. ఏపీతో పోలుస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కొనియాడారు సిద్ధ‌రామ‌య్య‌. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య క‌న్న‌డ భాష‌లో ట్వీట్ చేశారు.

ఒక మాజీ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఇలా జ‌గ‌న్ మీద ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో వైకాపా కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ అభిమానులు ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. ద‌టీజ్ జ‌గ‌న్ అంటూ కొనియాడుతున్నారు. డాక్ట‌ర్స్ డే సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కారు ఇటీవ‌లే ఒకేసారి 1086 అంబులెన్సులు (108, 104) ప్రారంభించ‌డంతో పాటు గుంటూరులో ఉచిత క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని కూడా అందుబాటులోకి తెచ్చింది.

This post was last modified on July 7, 2020 5:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

1 hour ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

8 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

8 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

9 hours ago