కరోనాపై పోరులో మొదట బాగా విమర్శలు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే అప్పుడు తెగిడిన నోళ్లే ఇప్పుడాయన్ని పొగుడుతున్నాయి. తన తప్పులను దిద్దుకున్న జగన్.. ఇప్పుడు కరోనాపై పోరులో సమర్థంగా పని చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపారు. దీంతో ఆయన ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరైన జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆయన్ని అభినందించక తప్పని పరిస్థితి వచ్చింది.
ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రవేశపెట్టడం ద్వారా నేషనల్ మీడియాలో సైతం జగన్ గురించి పాజిటివ్ న్యూస్లు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ట్విట్టర్ వేదికపై జగన్పై ప్రశంసలు కురిపించడం విశేషం.
తమ రాష్ట్రంలో పరిస్థితులను.. ఏపీతో పోలుస్తూ జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు సిద్ధరామయ్య. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య కన్నడ భాషలో ట్వీట్ చేశారు.
ఒక మాజీ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇలా జగన్ మీద ప్రశంసలు కురిపించడంతో వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు ఈ ట్వీట్ను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. దటీజ్ జగన్ అంటూ కొనియాడుతున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా జగన్ సర్కారు ఇటీవలే ఒకేసారి 1086 అంబులెన్సులు (108, 104) ప్రారంభించడంతో పాటు గుంటూరులో ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తెచ్చింది.
This post was last modified on July 7, 2020 5:10 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…