Political News

అయ్య‌న్న‌ను అక్క‌డే తొక్కేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

ఉత్త‌రాంధ్ర‌లోని న‌ర్సీపట్నం రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. అయ్య‌న్న‌కు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు.. పెట్ల ఉమా శంక‌ర్ గ‌ణేశ్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇరువురూ కూడా రాజ‌కీయంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించుకుంటారు. అయితే.. అయ్య‌న్న‌పై ఇప్పుడు.. తాజాగా పెట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో విశాఖ రాజ‌ధాని న‌గ‌రం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనిని అడ్డుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు తిప్పికొడతార‌న్నారు.

మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌ను పెయిడ్ యాత్ర‌గా పేర్కొన్నారు. అరసవల్లి సూర్యభగవానుడిని ద‌ర్శించుకోవాలంటే.. కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్లాలని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. కానీ పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని రైతుల‌ను ప్రశ్నించారు. గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఇదేస‌మ‌యంలో చింతకాయల అయ్యన్నపాత్రుడికి కూడా హెచ్చరికలు జారీ చేశారు.

అయ్య‌న్న పాత్రుడు.. రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని చెప్పారు. రైతుల పాదయాత్రకు ఆయన అండగా వస్తే అక్కడే తొక్కేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. విశాఖ‌కు రాజ‌ధాని రాకుండా అడ్డుకునే వారిని ప్ర‌జ‌లు త‌రిమి కొడ‌తార‌ని చెప్పారు. ఏ మొహం పెట్టుకుని.. అమ‌రావ‌తి రైతుల‌కు అయ్య‌న్న మ‌ద్ద‌తిస్తున్నాడ‌ని ప్ర‌శ్నించారు. ఎన్టీ రామారావు తెలుగువారి గుండెల్లో ఉన్న మాట నిజమే కానీ, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు అయ్యన్నకు లేదన్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై అయ్య‌న్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. గుడివాడ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాద‌యాత్ర‌కు స్థానిక టీడీపీ నాయ‌కులు స‌హా.. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయ‌కులు వ‌చ్చి .. సంఘీభావం తెలిపారు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago