Political News

రూ.2500 ఇస్తే కరోనా నెగెటివ్ రిపోర్ట్

కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ రావాలని ప్రార్థిస్తారు అందరూ. ఐతే మీకా భయం లేకుండా నెగెటివ్ తెప్పిస్తాం.. మీకు నెగెటివ్ అని పేర్కొంటూ రిపోర్ట్ ఇస్తాం.. ఇందుకోసం కేవలం రూ.2500 ఇస్తే చాలు అని ఆఫర్ చేస్తోందట ఓ ప్రైవేటు ఆసుపత్రి.

కరోనా ఉన్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు సోషల్ బాయ్‌కాట్‌కు గురి కాకుండా చేస్తామంటూ ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పి గుట్టుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది. ఇది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో చోటు చేసుకున్న ఆశ్చర్యకర ఉదంతం.

ఆ సిటీలోని న్యూ మీరట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కరోనా నెగెటివ్ రిపోర్టుల్ని అమ్మకానికి పెట్టినట్లు అధికారులకు సమాచారం అందడం.. వాళ్లు వెళ్లి తనిఖీ చేసి అది నిజమే అని నిర్ధరించడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు.

అంతే కాదు.. ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా వేశారు పోలీసులు. ఆస్ప‌త్రి లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. కాగా 2,500 రూపాయ‌ల‌కే కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికెట్లు మీ చేతిలో పెడతామంటూ ఆస్ప‌త్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీని ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

ఇక ఈ ఆరోప‌ణ‌ల‌ను స‌ద‌రు ఆస్ప‌త్రి యాజమాన్యం ఖండించింది. తమ‌కే పాపం తెలియ‌ద‌ని.. తమ ఆసుపత్రి పేరును చెడగొట్టేందుకు కొందరు కావాలనే ఈ వీడియోను బయటపెట్టారని ఆరోపించింది. అనివార్య పరిస్థితుల్లో కరోనా టెస్టులకు వెళ్లి.. పాజిటివ్‌గా తేలాక సోషల్ బాయ్‌కాట్‌కు గురవుతున్న వ్యక్తులు.. ఈ ఆసుపత్రి ద్వారా నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని అందరికీ తాము కరోనా ఫ్రీ అయ్యామని చెప్పుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

This post was last modified on July 7, 2020 5:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago