ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పడుకోబెట్టిన కరోనా తాజాగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కూడా సోకింది. ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయనడానికి చిహ్నంగా పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు.
కరోనా సోకినా అంజాద్ బాషా కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హొం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంజాద్ భాషా కడప ఎమ్మెల్యే. రేపు వైఎస్ జయంతి సందర్భంగా కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందు అంజాద్ కు కరోనా రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇదే వార్త రేపు బయటకు వచ్చింటే సీఎంకు కరోనా ప్రమాదం ఉండేదని… అదృష్టవశాత్తూ ఒక రోజు ముందుగా ఆయన కు టెస్టులు చేయడం మంచిదయ్యిందని అంటున్నారు.
హోంక్వారంటైన్ నేపథ్యంలో అంజాద్ భాషా లేకుండానే రేపు జగన్ పర్యటన జరగనుంది.మరో 28 రోజుల పాటు ఆయన గృహ నిర్బందంలోనే ఉంటారు. ఆయనకు ఇంకోసారి పరీక్షలు చేయనున్నారు. ఇంతకీ ఎలా బయటపడిందంటే.. సీఎం పర్యటన నేపథ్యంలో అందులో పాల్గొనబోయే ప్రజాప్రతినిధులకు, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు అధికారులు. టెస్టులు నెగెటివ్ వచ్చిన వారినే ఈ పర్యటనలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…