Political News

ఇది మరో తలతిక్క నిర్ణయమేనా ?

జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలను ఎందుకు తీసుకుంటోందో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. తాజాగా కృష్ణా బోర్డును విశాఖపట్నంకు తరలించాలని డిసైడ్ చేసింది. ప్రస్తుతం కృష్ణాబోర్డు హైదరాబాద్ లో ఉంది. దీన్ని ఏపీలోని విశాఖకు తరలించాలని కోరుతూ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. విశాఖలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఏడు వేల చదరపు అడుగుల స్ధలం ఉందని ప్రభుత్వం లేఖలో చెప్పింది.

కార్యాలయం ఏర్పాటుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనం అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖలో స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలోనే విశాఖపట్నంలో పర్యటించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు కార్యాలయం ఏర్పాటుకు కనీసం 10 వేల చదరపు అడుగుల స్ధలం అవసరమని స్పష్టంగా చెప్పారు.

బోర్డు ఉన్నతాధికారులు ఏమో 10 వేల చదరపు అడుగుల స్ధలం అవసరమని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏడువేల చదరపు అడుగుల స్ధలముందని చెబుతోంది. అంటే బోర్డు చెప్పినదానికన్నా ప్రభుత్వం చెప్పిన స్ధలం 3 వేల చదరపు అడుగుల స్ధలం తక్కువ. మరి విస్తీర్ణం ఇంత తక్కువుంటే బోర్డు ఉన్నతాధికారులు అంగీకరిస్తారో లేదో తెలీదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు బోర్డు కార్యాలయం ఏర్పాటు విశాఖపట్నంలో ఎందుకు చేస్తోందో అర్ధం కావటంలేదు.

నిజానికి బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేయటమే కరెక్టు. ఎందుకంటే కృష్ణానది మనరాష్ట్రంలోకి ప్రవేశించేది కర్నూలు జిల్లాలో నుండే. కృష్ణానదీ ముఖద్వారం కర్నూలు జిల్లాలోనే కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇక్కడే ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా జిల్లాలో వినబడుతున్నాయి. అయినా కృష్ణానదీ పరీవాహక ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా రాజధానిగా మార్చాలని అనుకుంటున్నది కాబట్టి బోర్డును విశాఖలోనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నదేమో. ఏది ఏమైనా ఇది అనాలోచిత నిర్ణయంగా చూడాలి.

This post was last modified on September 23, 2022 11:04 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

8 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

8 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

10 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

10 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

15 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

17 hours ago