Political News

కోవిడ్ వచ్చాక జగన్ తొలి రూరల్ టూర్ ఇదే

వైఎస్సార్ జయంతికి వైఎస్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇపుడుపుపాయలకు చేరుకుని తండ్రి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించడం ఆనవాయితీ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రెండో జయంతి కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి ఇడుపుల పాయకు హెలికాప్టర్ లో వెళ్తారు. అక్కడ కుటుంబ అతిథి గృహంలో ఉంటారు.

అయితే, కోవిడ్ నేపథ్యంలో సీఎం జగన్ తొలి లాంగ్ టూర్ ఇదే. కడపకు ఎపుడు వెళ్లినా రెండు రోజులు ఉండే జగన్ ఈసారి కార్యక్రమం అనంతరం వెంటనే వెనుదిరగనున్నారు. కోవిడ్ భయమే దీనికి కారణం. ఎందుకంటే కడపలో ఉంటే నేతల తాకిడి ఉంటుంది. అందుకే ఈసారి ఆ హడావుడి ఏమీ పెట్టుకోవడం లేదు.

అంతేకాదు, కోవిడ్‌–19 వ్యాప్తి నేపత్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌ (ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటిస్తున్నారు. పర్యటనలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కోవిడ్‌–19 త్రోట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించుకున్న తర్వాతే అనుమతిస్తారు. సాధారణ జనం తాకిడి ఈసారి ఉండదు. అంతేకాదు, ట్రిపుల్ ఐటీలో పలు కార్యక్రమాలున్న నేపథ్యంలో బయటనుండి వచ్చిన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ముందురోజు అంటే మంగళవారం నిర్ణయించిన వారికే అనుమతి. స్టాఫ్, స్టూడెంట్స్ తప్ప అక్కడ కూడా ఎవరినీ అనుమతించరు. వీరన్నగట్టుపల్లె క్రాస్‌ నుంచి 7 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అన్ని చోట్ల చెక్ ‌చేసి పంపిస్తారు.

జగన్ టూర్ షెడ్యూల్ హైలెట్స్

  1. రేపు ఉదయం కుటుంబంతో కలిసి వైఎస్ సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటిస్తారు.
  2. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) కొత్త భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
  3. ట్రిపుల్‌ ఐటీలో వైఎస్సార్‌ స్మారక విగ్రహ ఆవిష్కరిస్తారు.
  4. మూడు మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన
  5. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగుప్రయాణం ఉంటుంది
  6. కోవిడ్ నేపథ్యంలో జగన్ పర్యటన కొత్తగా ఉండనుంది.

This post was last modified on July 7, 2020 5:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: JaganYSRCP

Recent Posts

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

36 minutes ago

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…

46 minutes ago

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

4 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

5 hours ago

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల…

5 hours ago

కొడాలి నానికి అందరూ దూరమవుతున్నారు

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్‌.. కొడాలి నానికి రాజ‌కీయంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో గట్టి ప‌ట్టుంది. ఆయ‌న వ‌రుస విజ‌యాలు…

5 hours ago