వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతోకలేని నిర్ణయాలపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరు వైఎస్పై అభిమానంతో సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఈ దూకుడు మరింత దారుణంగా మారిపోవడంతో విసుగు చెందిన వారు.. పార్టీ నుంచి.. పదవుల నుంచి కూడా బయటకు వస్తున్నారు. తాజాగా కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
వీరిలో కీలకమైన వ్యక్తి.. అన్నగారితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ప్రముఖ రచయిత.. యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్. అన్నగారు జీవించి ఉన్నన్నాళ్లు.. ఆయనకు వ్యక్తిగత సలహాదారుగా.. కూడా యార్లగడ్డ పనిచేశారు. అన్నగారి ప్రోత్సాహంతో అనేక కీలక విషయాల్లోనూ.. ఆయన సలహాలు ఇచ్చారు. అన్నగారి మరణం తర్వాత.. ఆయన కుటుంబంతో బంధం తగ్గించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వైఎస్తో నూ అనుబంధం ఏర్పడింది.
ఇది కాలక్రమంలో వైసీపీకి కూడా మద్దతుగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అధికార భాషా సంఘానికి.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. చైర్మన్గా వ్యవహిస్తున్నారు. అయితే..ఇప్పటి వరకు సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదం అయినా.. ఆయన భరించారని.. యార్లగడ్డ సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగు మీడియం తీసేయడం.. అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం చేయడంవంటివి.. ఆయనను ఇరకాటంలో పడేశాయి.
ఈక్రమంలో యార్లగడ్డపై ఒత్తిళ్లు కూడాపెరిగాయి. తెలుగు భాషాభిమాని అయిన.. యార్లగడ్డ.. తెలుగు కు వైసీపీ సర్కారు అన్యాయం చేస్తుంటే.. ఎలా చూస్తూ.. ఊరుకున్నారనే విమర్శలు పెల్లుబికాయి. అయినా.. ఆయన పంటిబిగువన భరించారు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంతో ఆయనఇక, రాం రాం చెప్పేశారు. తన తెలుగు భాషా చైర్మన్.. పదవికి రాజీనామా చేసేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధగా ఉందని అన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 21, 2022 12:38 pm
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…
బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది.…
వైసీపీ అధినేత జగన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూటమి సర్కారు చక్కగా వినియోగించుకుంటోందా? ఈ…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…