వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతోకలేని నిర్ణయాలపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరు వైఎస్పై అభిమానంతో సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఈ దూకుడు మరింత దారుణంగా మారిపోవడంతో విసుగు చెందిన వారు.. పార్టీ నుంచి.. పదవుల నుంచి కూడా బయటకు వస్తున్నారు. తాజాగా కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
వీరిలో కీలకమైన వ్యక్తి.. అన్నగారితో అత్యంత సాన్నిహిత్యం ఉన్న ప్రముఖ రచయిత.. యార్లగడ్డ లక్ష్మీప్ర సాద్. అన్నగారు జీవించి ఉన్నన్నాళ్లు.. ఆయనకు వ్యక్తిగత సలహాదారుగా.. కూడా యార్లగడ్డ పనిచేశారు. అన్నగారి ప్రోత్సాహంతో అనేక కీలక విషయాల్లోనూ.. ఆయన సలహాలు ఇచ్చారు. అన్నగారి మరణం తర్వాత.. ఆయన కుటుంబంతో బంధం తగ్గించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వైఎస్తో నూ అనుబంధం ఏర్పడింది.
ఇది కాలక్రమంలో వైసీపీకి కూడా మద్దతుగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అధికార భాషా సంఘానికి.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. చైర్మన్గా వ్యవహిస్తున్నారు. అయితే..ఇప్పటి వరకు సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదం అయినా.. ఆయన భరించారని.. యార్లగడ్డ సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగు మీడియం తీసేయడం.. అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం చేయడంవంటివి.. ఆయనను ఇరకాటంలో పడేశాయి.
ఈక్రమంలో యార్లగడ్డపై ఒత్తిళ్లు కూడాపెరిగాయి. తెలుగు భాషాభిమాని అయిన.. యార్లగడ్డ.. తెలుగు కు వైసీపీ సర్కారు అన్యాయం చేస్తుంటే.. ఎలా చూస్తూ.. ఊరుకున్నారనే విమర్శలు పెల్లుబికాయి. అయినా.. ఆయన పంటిబిగువన భరించారు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంతో ఆయనఇక, రాం రాం చెప్పేశారు. తన తెలుగు భాషా చైర్మన్.. పదవికి రాజీనామా చేసేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధగా ఉందని అన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 21, 2022 12:38 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…