అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలోనూ.. టీడీపీ చాలా వరకు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్రధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒకటి.. పార్టీకి నాయకుడు లేకపోవడం. అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు.. సభకు రాకుండా.. దూరంగా ఉండడం ఒక పెద్ద మైనస్. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే సభకు హాజరుకావడం.
దీంతో సాధారణంగానే టీడీపీ ఏం పుంజుకుంటుంది? ఎలా ముందుకుసాగుతుంది? అనే చర్చ జోరుగానే సాగింది. ఎందుకంటే.. కీలకమైన.. చంద్రబాబు లేనప్పుడు..సభలో పార్టీ సభ్యులు ఎలా దూకుడు ప్రదర్శిస్తారనే అంశం.. ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు లేకున్నా.. ఆయన కనుసన్నల్లో నాయకులు దూకుడుగా ఉన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నుంచి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వరకు అందరూ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
బలమైన ప్రశ్నలు సంధించడంతోపాటు.. అధికార పార్టీ సభ్యులకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు. విషయాలపై కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా రాజీలేని పోరాటంతో చంద్రబాబు లేకపోయినా.. సభను ఆద్యంతం ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో గడిచిన మూడు రోజుల సభ.. కూడా టీడీపీ సభ్యులే పైచేయి సాధించారనే వాదన వినిపిస్తోంది. ఇక, నిత్యం సస్పెండ్ అవుతున్నా.. ప్రజలకు గట్టి వాయిస్ను అందిస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇక, శాసన మండలిలోనూ.. టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎవరూ కూడా.. ఎక్కడా రాజీ పడడం లేదు. దీపక్రెడ్డి.. ఫరూక్.. నారా లోకేష్.. వంటివారు.. అధికార పక్షాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న అంశాలను కార్నర్ చేస్తూ..ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నేతల దూకుడుకు అంతే దూకుడుగా సమాధానం కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు సభల్లోనూ టీడీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 21, 2022 6:48 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…