అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలోనూ.. టీడీపీ చాలా వరకు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్రధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒకటి.. పార్టీకి నాయకుడు లేకపోవడం. అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు.. సభకు రాకుండా.. దూరంగా ఉండడం ఒక పెద్ద మైనస్. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే సభకు హాజరుకావడం.
దీంతో సాధారణంగానే టీడీపీ ఏం పుంజుకుంటుంది? ఎలా ముందుకుసాగుతుంది? అనే చర్చ జోరుగానే సాగింది. ఎందుకంటే.. కీలకమైన.. చంద్రబాబు లేనప్పుడు..సభలో పార్టీ సభ్యులు ఎలా దూకుడు ప్రదర్శిస్తారనే అంశం.. ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు లేకున్నా.. ఆయన కనుసన్నల్లో నాయకులు దూకుడుగా ఉన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నుంచి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వరకు అందరూ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
బలమైన ప్రశ్నలు సంధించడంతోపాటు.. అధికార పార్టీ సభ్యులకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు. విషయాలపై కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా రాజీలేని పోరాటంతో చంద్రబాబు లేకపోయినా.. సభను ఆద్యంతం ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో గడిచిన మూడు రోజుల సభ.. కూడా టీడీపీ సభ్యులే పైచేయి సాధించారనే వాదన వినిపిస్తోంది. ఇక, నిత్యం సస్పెండ్ అవుతున్నా.. ప్రజలకు గట్టి వాయిస్ను అందిస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇక, శాసన మండలిలోనూ.. టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎవరూ కూడా.. ఎక్కడా రాజీ పడడం లేదు. దీపక్రెడ్డి.. ఫరూక్.. నారా లోకేష్.. వంటివారు.. అధికార పక్షాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న అంశాలను కార్నర్ చేస్తూ..ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నేతల దూకుడుకు అంతే దూకుడుగా సమాధానం కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు సభల్లోనూ టీడీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…