Political News

వైసీపీకి 67 అంటే… ఇంత మంది క‌లిసినా..?

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అధికార పార్టీ వైసీపీకి సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆ పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 45 నుంచి 67 స్థానాలు వ‌స్తాయ‌ని.. చెప్పారు. త‌న‌కు అందిన స‌ర్వే రిపోర్టులు స‌హా.. మేధావి వ‌ర్గాలు వేసిన అంచ‌నాల ప్ర‌కారం.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నాడిని తెలుసుకున్న త‌ర్వాతే తాను ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు ప‌వ‌న్ చెప్ప‌కొచ్చారు. అంతేకాదు.. జ‌న‌సేన పుంజుకుంద‌న్నారు. వాస్త‌వానికి ఈ ప్ర‌క‌ట‌న సంచ‌లనమే . ఎందుకంటే.. ప‌వ‌న్ చెప్పిన దానిని బ‌ట్టి.. 2014 సీన్ రిపీట్ కానుంద‌నేది ఆయ‌న మాట‌ల అంత‌రార్థంగా ఉంది.

అయితే..ఇటీవ‌ల వ‌ర‌కు కూడా ప‌వ‌న్‌.. చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే.. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిర‌క‌త వ్య‌క్తంచేస్తున్నార‌ని.. వైసీపీ నేత‌ల‌ను త‌రిమితరిమి కొట్టే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని.. ఒక్క‌సీటు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పార్టీ ఆవిర్భావం రోజు.. త‌ర్వాత జ‌రిగిన‌.. విశాఖ‌లో స‌భ‌లోనూ.. చెప్పుకొచ్చారు. దీనిని అందరూ..నిజ‌మేనేమో.. అనుకున్నారు. ఎందుకంటే.. కేవ‌లం వైసీపీ స‌ర్కారు.. సంక్షేమంపైనే దృష్టి పెట్టింది.

అభివృద్ధిని, ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌ను అట‌కెక్కించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ బాగానే చెప్పార‌ని అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో కామెంట్లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ అదే నోటితో.. దాదాపు 67 సీట్ల వ‌ర‌కువైసీపీకి ఛాన్స్ ఉంద‌ని చెప్పుకొచ్చారు. అంటే దీనిని బ‌ట్టి.. వైసీపీ హ‌వా పెద్ద‌గా త‌గ్గ‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాదాపు టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూడా క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మ‌రి ఇంత మంది క‌లిసినా.. వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌లు వ్య‌తిర‌క‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని.. చెబుతున్నా.. ఈ రిజ‌ల్ట్ రావ‌డం అంటే.. విప‌క్షాల ఐక్య‌త‌పైనే.. పెద్ద ప్ర‌శ్న వ‌స్తోంది. ప్ర‌జ‌ల్లో ఈ మూడు పార్టీలు క‌లుసుకోవ‌డంపై.. ఏదో అభిప్రాయం ఉంద‌నే తెలుస్తోంది. ఎందుకంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేత‌క‌.. మూడు పార్టీల క‌ల‌యిక.. వంటి ఈక్వేష‌న్లు ప‌నిచేస్తే.. వైసీపీ తుడిచి పెట్టుకుపోవాలి. అంటే.. ఒక‌టి రెండు లేదా.. 10 లోపు మాత్ర‌మే సీట్లు రావాలి. అలా కాదు.. 2014లో వ‌చ్చిన సీట్లు వ‌స్తాయ‌ని అంటే..వైసీపీ వైపు ప్ర‌జ‌లు మొగ్గుతున్నార‌నే అర్ధం చేసుకోవాల‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

This post was last modified on September 20, 2022 2:38 pm

Share

Recent Posts

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

17 minutes ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

54 minutes ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

1 hour ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

1 hour ago

విశ్వదాభిరామా… వినవయ్యా విశ్వంభరా

చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…

2 hours ago

ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…

2 hours ago