ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి వికెట్ పడిందా ? అందరిలోను ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లిక్కర్ స్కామ్ పై విచారణలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు హైదరాబాద్ లో చాలా చోట్ల సోదాలు చేశారు. ఇందులో భాగంగానే అనేక వ్యాపారాలు చేస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును విచారించిన ఈడీ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
ఎప్పుడైతే ఈ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారో వెంటనే మొదటి వికెట్ పడినట్లు అర్ధమైంది. ఇప్పటివరకు అనేకమందిని ఈడీ విచారించింది. ఒకటికి రెండురోజుల పాటు విచారించింది కానీ ఎవరినీ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించలేదు. శ్రీనివాసరావు విషయంలోనే అదుపులోకి తీసుకున్నట్లు మొదటిసారి ప్రకటించింది. అధికార పార్టీ లోని చాలామంది కీలక వ్యక్తులతో ఈ వ్యాపారికి బాగా సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం.
హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈయనకు చాలా వ్యాపారాలున్నాయట. స్కామ్ కు సంబంధించి రు. 2 వేల కోట్ల సమీకరణలో ఈయనదే కీలకపాత్రగా ఈడీ అనుమానిస్తోంది. స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా ఈడీ అనుమానిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్ళైకి శ్రీనివాసరావుకు మధ్య సోషల్ మీడియా ఖాతా ద్వారా చాలా వ్యవహారాలు నడిచినట్లు ఈడీ గుర్తించింది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ఈ వ్యాపారి ద్వారానే సుమారు రు. 200 కోట్లు అందినట్లు ఈడీ గట్టిగా అనుమానిస్తోంది.
ఇప్పటివరకు నాలుగుసార్లు ఈడీ హైదరాబాద్ లోని అనేక మందిపై దాడులు చేసి విచారణ జరిపింది. అప్పుడెప్పుడూ శ్రీనివాసరావు విషయం వెలుగులోకి రాలేదు. కానీ సోమవారం హఠాత్తుగా వెన్నమనేని ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు చేయటంతో అందరు ఆశ్చర్యపోయారు. దానికి తోడు ఈయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో ఈయనెవరా అనే విషయంలో రాజకీయవర్గాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on September 20, 2022 2:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…