Political News

మందు కొట్టి విమానం ఎక్కిన సీఎం?

ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నాయ‌కుడు..ఉన్న‌త విద్యావంతుడు.. పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే బాధ్య‌తలు చేప‌ట్టిన భ‌గ‌వంత్ మాన్ పూటుగా మ‌ద్యం తాగారా.. ? న‌డ‌వ‌లేని స్థితిలో ఆయ‌న విమానాశ్ర‌యం చేరుకు న్నారా? విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారా? అయితే.. ఆయ‌న‌ను విమానంలోని సిబ్బంది.. దింపేశా రా? ఇదీ.. ఇప్పుడు.. పెద్ద ఎత్తున దేశంలో రేగిన క‌ల‌కలం. అయితే.. ఇది నిజ‌మేన‌ని.. పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమ‌ణి అకాళీద‌ళ్ చీఫ్ సుఖ‌బీర్ సింగ్ బాద‌ల్ అంటున్నారు. భ‌గ‌వంత్‌ మాన్తోపాటు శ‌నివారం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణి కులు ఈ విషయం చెప్పారంటూ సుఖ‌బీర్‌ ట్వీట్ చేశారు.

“మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయా రు. ఈ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. అయితే.. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” అని బాద‌ల్‌ ట్వీట్ చేశారు.

రాజీనామా చేయండి!

పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సైతం ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్ది తప్పని తేలితే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ పరోక్షంగా కేజ్రీవాల్, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భగవంత్ మాన్పై చర్యలు తీసుకుంటారా లేదా అని కేజ్రీవాల్ను ప్రశ్నించారు.

ఆప్ ఖండ‌న‌

ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాల నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆ పార్టీ వ‌ర్గాలు మండిపడ్డాయి.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago