Political News

అమ‌రావ‌తిపై ఏపీ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌ !

ఏపీ రాజ‌ధాని న‌గ‌రం అమరావతిని మున్సిపాల్టీగా మార్చే విష‌యంలో స‌ర్కారుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ నెల 12 నుంచి నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లు ముగిశాయి. అయితే.. ఈ గ్రామసభల్లో రైతులు ఎవ‌రూ కూడా మునిసిపాలిటీకి.. అనుకూలంగా చెయ్యెత్త‌లేదు. పైగా.. మునిసిపాలిటీ కాదు.. మ‌హా సిటీ కావాల‌ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కలిపి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసి గ్రామసభలు ఏర్పాటు చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్దేశం ఏమైనప్పటికీ రాజధాని రైతులు.. మరోసారి పట్టుదలను, ఐకమత్యాన్ని చాటిచెప్పారు. 22 గ్రామాల్లోనూ అధికారులు సభలు నిర్వహించగా.. అన్ని గ్రామాల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు. బోరుపాలెంలో ఇద్దరు, లింగాయపాలెం, నెక్కళ్లు, శాఖమూరులో ఒక్కొక్కరు చొప్పున మున్సిపాల్టీకి అనుకూలమని చేతులెత్తారు. 22 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టారు. గ్రామసభల్లో స్థానికులు తమ అభ్యంతరాలను గట్టిగానే చెప్పారు. తాము భూములిచ్చింది రాజధాని కోసమని మున్సిపాల్టీగా మార్చడం వల్ల తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు.

మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు ముహూర్తం పెట్టినరోజే ప్రభుత్వం గ్రామసభలు పెట్టింది. ప్రభుత్వ ఎత్తుగడను అర్థం చేసుకున్న రైతులు.. 22 గ్రామాల్లోనూ పాదయాత్రకు వెళ్లనివారితో తమ నిరసన గళాన్ని విన్పించడంలో విజయం సాధించారు. ఓవైపు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే… మరోవైపు తమ డిమాండ్ల చిట్టాను అధికారులకు అందజేశారు. 2015లో 3 మండలాల్లో 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ కింద అప్పటి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం అభివృద్ధి జరగాలని రైతులు కోరారు.

మున్సిపాల్టీ ఏర్పాటుకు తగిన జనాభా నిష్పత్తి లేనప్పటికీ ప్రభుత్వం మున్సిపాల్టీని అమలుచేయడానికి ఎందుకు ముందుకు వచ్చిందని రైతులు ప్రశ్నించారు. రాజధాని పనులు ఆగిపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీగా మారిస్తే ఉపాధి హామీ పనులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు జరపాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు రాజధాని గ్రామాలను ముక్కలు చెక్కలు చేయడం ద్వారా కోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందని రైతులు చెప్పారు.

అసలు ప్రజలు కోరుకుండానే.. ఎలాంటి తీర్మానం చేయకుండానే ప్రభుత్వం మున్సిపాల్టీగా మార్చడం వెనుక ఉద్దేశమేమిటని రైతులు ప్రశ్నించారు. 22 గ్రామసభల్లోనూ ప్రజలు మున్సిపాల్టీ వద్దంటూ.. రాజధాని నిర్మాణం కావాలంటూ చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు. ఇక‌, దీనిపై స‌ర్కారుఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on September 18, 2022 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago