Political News

‘మీ రాజ‌ధాని ఏదంటూ మా అమ్మాయిని ఆట‌ప‌ట్టిస్తున్నారు’

ఏపీ రాజ‌ధాని అంశం.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఏపీకి రాజ‌ధాని ఏదీ.. అంటూ.. ఇటీవ‌ల‌.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజ‌కీయంగా కూడా ఇది అప్ప‌ట్లో దుమారం రేపింది. ఒక‌.. క్యాంప‌స్‌లో ప్ర‌సంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సంద‌ర్భంగా.. అక్క‌డి విద్యార్థులు.. ‘మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి సాధ్య‌మేనా?’ అని ప్ర‌శ్నించ‌డం కూడా వైసీపీని ఇర‌కాటంలో ప‌డేసింది.

ఇలా.. ఈ ఒక్క సంద‌ర్భ‌మే కాదు.. ఏపీ రాజ‌ధాని గురించి.. అనేక రూపాల్లో విమ‌ర్శ‌లు.. వివాదాలు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా త‌న కుటుంబంలోని త‌న కుమార్తెకు జ‌రిగిన అవ‌మానంపైనా.. టీజింగ్ పైనా.. ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ తీవ్ర ఆవేద‌న.. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అని జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరరాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు.

“మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె ఢిల్లీలోని ఓ కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్య పరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది” అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభలో హైకోర్టు జడ్జి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ఒక్క న్యాయ‌మూర్తే కాదు.. ఇంజ‌నీరింగ్ రంగ నిపుణులు.. వైద్య‌రంగ నిపుణులు కూడా ఇదే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “రాష్ట్రానికి కేరాఫ్ లేదా?” అని ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థి ఒక‌రు.. ఏపీ విద్యార్థుల‌ను ప్ర‌శ్నించిన వీడియో కొన్నాళ్ల కింద‌ట వైర‌ల్ అయింది. ఇలా.. ఒక్క‌టేమిటి.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో త‌లెత్తుతున్న అనేక వివాదాలు.. విమ‌ర్శ‌లు త‌ర‌చుగా.. తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లో.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

This post was last modified on September 18, 2022 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago