ఏపీ రాజధాని అంశం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రధాన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏపీకి రాజధాని ఏదీ.. అంటూ.. ఇటీవల.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజకీయంగా కూడా ఇది అప్పట్లో దుమారం రేపింది. ఒక.. క్యాంపస్లో ప్రసంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సందర్భంగా.. అక్కడి విద్యార్థులు.. ‘మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమేనా?’ అని ప్రశ్నించడం కూడా వైసీపీని ఇరకాటంలో పడేసింది.
ఇలా.. ఈ ఒక్క సందర్భమే కాదు.. ఏపీ రాజధాని గురించి.. అనేక రూపాల్లో విమర్శలు.. వివాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తన కుటుంబంలోని తన కుమార్తెకు జరిగిన అవమానంపైనా.. టీజింగ్ పైనా.. ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర ఆవేదన.. ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అని జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరరాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు.
“మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె ఢిల్లీలోని ఓ కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్య పరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది” అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభలో హైకోర్టు జడ్జి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఒక్క న్యాయమూర్తే కాదు.. ఇంజనీరింగ్ రంగ నిపుణులు.. వైద్యరంగ నిపుణులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “రాష్ట్రానికి కేరాఫ్ లేదా?” అని ఖరగ్ పూర్ విద్యార్థి ఒకరు.. ఏపీ విద్యార్థులను ప్రశ్నించిన వీడియో కొన్నాళ్ల కిందట వైరల్ అయింది. ఇలా.. ఒక్కటేమిటి.. ఏపీ రాజధాని విషయంలో తలెత్తుతున్న అనేక వివాదాలు.. విమర్శలు తరచుగా.. తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఈ పరంపరలో.. న్యాయమూర్తి జస్టిస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
This post was last modified on September 18, 2022 2:50 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…