జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా స్పీడ్ మీదున్న కేసీయార్ ప్రత్యేకంగా తన టీమును రెడీ చేసుకుంటున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కేసీయార్ చేసిన ప్రకటన ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తునే మరోవైపు క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక క్రియాశీలకంగా ఉండక వేరేదారేముంది ?
సరే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే జాతీయ రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలని అనుకుంటే వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటేనే సాధ్యమవుతుంది. జాతీయ పార్టీల అధినేతలు, ప్రాంతీయ పార్టీల అధినేతల్లో కొందరు ఎక్కువకాలం ఢిల్లీలోనే ఉంటున్న విషయం చేస్తున్నదే. మరి కేసీయార్ మాత్రం సీఎంగా ఉంటూనే ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు.
ఇక్కడే అందరినీ అయోమయంలోకి పడేస్తోంది. ఇందు కోసమే ప్రత్యేకంగా ఒక టీమును రెడీ చేసుకుంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కర్నాటకలో జేడీఎస్ ప్రముఖుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా లాంటి వాళ్ళని తన టీములో చేర్చుకోబోతున్నట్లు సమాచారం. కుమారస్వామి అయినా వాఘేలా అయిన ప్రస్తుతానికి తీసేసిన తహసీల్దార్లే. వాఘేలా దాదాపు పాతికేళ్ళకిందటే ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఆయన చాలా పార్టీలు మారినా ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
కుమారస్వామి పరిస్థితి కూడా డిటోనే. ఇలాంటి వాళ్ళని మరికొందరిని తనతో టై అప్ చేసుకుని వీళ్ళల్లో కొందరిని ఢిల్లీలోనే ఉండేట్లుగా కేసీయార్ మంతనాలు జరుపుతున్నారట. లేకపోతే వాఘేలాతో కేసీయార్ ఐదుగంటలపాటు చర్చలు జరపాల్సిన అవసరమే లేదు. ఇలాగే తొందరలోనే మరికొందరు సీనియర్లను కలుపుకుని ఒక టీమును రెడీ చేసుకోవాలని కేసీయార్ అనుకుంటున్నారట. వీళ్ళకు తన పార్టీలోని అత్యంత నమ్మకస్తులను కూడా జతచేసి ఢిల్లీలో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 22, 2022 10:37 am
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…