Telangana ప్రభుత్వం.. అధికారికంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు .. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన వజ్రో త్సవాల్లో.. సీఎం కేసీఆర్.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో దేశం, రాష్ట్రంలో పేట్రోగిపోతున్న మతోన్మాదశక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు విద్వేషపు మంటలు రగిలిస్తూ, విషవ్యాఖ్యలతో తెలంగాణలో ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు
జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలను తిప్పికొట్టాలని ముఖ్యంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తొలుత అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైందన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవని చెప్పారు. ఆనాడు స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్లో విలీనం అయ్యాయని, ఆనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందామన్నారు. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని కేసీఆర్ చెప్పారు.
మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగిందని చెప్పిన కేసీఆర్… స్వాంతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేదన్నారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరిట హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీతో కలిపారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారని చెప్పారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని కేసీఆర్ ఉద్ఘాటించారు.
This post was last modified on September 17, 2022 12:34 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…