Political News

ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌లు హ‌డ‌లి పోతున్నారే ?

ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కులు.. హ‌డ‌లి పోతున్నారట‌. త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఎక్క‌డ విముఖత వ‌స్తుందో.. రేపు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌కు బెడిసికొట్టే ప‌రిస్థితి ఉందేమో.. అనివారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఏపీ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి యాత్రే న‌ని.. పార్టీ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వ‌చ్చింది.

రైతులు చేప‌ట్టిన రాజ‌ధాని ఉద్య‌మానికి కావొచ్చు.. హైకోర్టు చేసిన తీర్పు విష‌యంలో కానీ.. ప్ర‌జ‌లు సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. రైతుల‌కు అడుగ‌డుగునా.. హార‌తులు ప‌ట్టారు. హైకోర్టు తీర్పు రావ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ ప‌రిణామం.. వైసీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు మూడు రాజ‌ధానులు కోరుకుంటున్నారని.. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు ఊరూ వాడా చెబుతున్నారు.

ఇది నిజ‌మే అయితే.. మూడు ప్రాంతాల్లో.. ప్ర‌జ‌ల నుంచే ఈ డిమాండ్లు వ‌చ్చేవి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌జ‌ల నుంచి రాలేదు. క‌నీసం.. సోష‌ల్ మీడియాలో అయినా.. ఉద్య‌మాలు రాలేదు. అంటే.. ప్ర‌జ‌లు.. అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా కోరుకుంటున్నార‌నేది.. వారి మౌనాన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వు తోంది. ఇక‌, ఉత్త‌రాంధ్ర విష‌యానికి వ‌చ్చినా.. ఇక్క‌డ కూడా స‌ర్కారు చెబుతున్న రాజ‌ధాని కోసం.. ప్ర‌జ ల్లో సెంటిమెంటు క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు.. రాజ‌కీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. తాము చెబుతున్న మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి.. అభిప్రాయాలూ రావ‌డం లేదు. పోనీ.. రైతులు చేస్తున్న పాద యాత్ర‌కు కూడా వ్య‌తిరేకంగా.. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఇదే బ‌ల‌ప‌డి.. ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు.. పాద‌యాత్ర సాగితే.. తాము చెబుతున్న మూడు రాజ‌ధానులకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు లేద‌నే.. వాద‌న బ‌ల‌ప‌డు తుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అందుకే.. ఎదురు దాడులు.. విమ‌ర్శ‌లు పెంచుతున్నారు. ఏదేమైనా.. రైతుల ఉద్య‌మాన్ని ఏదో ఒక ర‌కంగా.. ఆపేయాల‌నే రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ కుయుక్తులు ఎన్నాళ్లో సాగ‌వ‌నేది.. వారి మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

1 hour ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

6 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

9 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

11 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

11 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

11 hours ago