Political News

ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌లు హ‌డ‌లి పోతున్నారే ?

ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కులు.. హ‌డ‌లి పోతున్నారట‌. త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఎక్క‌డ విముఖత వ‌స్తుందో.. రేపు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌కు బెడిసికొట్టే ప‌రిస్థితి ఉందేమో.. అనివారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఏపీ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి యాత్రే న‌ని.. పార్టీ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వ‌చ్చింది.

రైతులు చేప‌ట్టిన రాజ‌ధాని ఉద్య‌మానికి కావొచ్చు.. హైకోర్టు చేసిన తీర్పు విష‌యంలో కానీ.. ప్ర‌జ‌లు సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. రైతుల‌కు అడుగ‌డుగునా.. హార‌తులు ప‌ట్టారు. హైకోర్టు తీర్పు రావ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ ప‌రిణామం.. వైసీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు మూడు రాజ‌ధానులు కోరుకుంటున్నారని.. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు ఊరూ వాడా చెబుతున్నారు.

ఇది నిజ‌మే అయితే.. మూడు ప్రాంతాల్లో.. ప్ర‌జ‌ల నుంచే ఈ డిమాండ్లు వ‌చ్చేవి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌జ‌ల నుంచి రాలేదు. క‌నీసం.. సోష‌ల్ మీడియాలో అయినా.. ఉద్య‌మాలు రాలేదు. అంటే.. ప్ర‌జ‌లు.. అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా కోరుకుంటున్నార‌నేది.. వారి మౌనాన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వు తోంది. ఇక‌, ఉత్త‌రాంధ్ర విష‌యానికి వ‌చ్చినా.. ఇక్క‌డ కూడా స‌ర్కారు చెబుతున్న రాజ‌ధాని కోసం.. ప్ర‌జ ల్లో సెంటిమెంటు క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు.. రాజ‌కీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. తాము చెబుతున్న మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి.. అభిప్రాయాలూ రావ‌డం లేదు. పోనీ.. రైతులు చేస్తున్న పాద యాత్ర‌కు కూడా వ్య‌తిరేకంగా.. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఇదే బ‌ల‌ప‌డి.. ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు.. పాద‌యాత్ర సాగితే.. తాము చెబుతున్న మూడు రాజ‌ధానులకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు లేద‌నే.. వాద‌న బ‌ల‌ప‌డు తుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అందుకే.. ఎదురు దాడులు.. విమ‌ర్శ‌లు పెంచుతున్నారు. ఏదేమైనా.. రైతుల ఉద్య‌మాన్ని ఏదో ఒక ర‌కంగా.. ఆపేయాల‌నే రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ కుయుక్తులు ఎన్నాళ్లో సాగ‌వ‌నేది.. వారి మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 15, 2022 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago