మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది.
ఎప్పుడైతే అఖిల వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయటానికి ట్రై చేస్తున్నారనే ప్రచారం మొదలైందో వెంటనే నంద్యాలలోని నేతలంతా అలర్టయ్యారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి లాంటి నేతలంతా గోల పెడుతున్నారు. వీళ్ళ గోలకు కారణం ఏమిటంటే నంద్యాలలో పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అఖిల మంచి భవనం కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే ఆళ్ళగడ్డలో పార్టీ ఆఫీసుతో సంబంధంలేకుండా సొంతంగా ఆమె ఒక ఆఫీసును పెట్టుకున్నారు.
ఆళ్ళగడ్డలో ఉన్నట్లే నంద్యాలలో కూడా సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దానికితోడు ఎక్కువగా నంద్యాలలోనే అఖిల క్యాంపు వేస్తున్నారట. ఆళ్ళగడ్డకన్నా నంద్యాలలోనే అఖిల ఎక్కువగా కనబడుతుండటంతో పార్టీలో కూడా అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఫరూక్ అండ్ కో చంద్రబాబునాయుడుతో ప్రస్తావించారట. అయితే చంద్రబాబు స్పందన ఏమిటో బయటకు రాలేదు. కానీ నేతల్లో గందరగోళం మాత్రం పెరిగిపోతోందట.
అసలు ఆళ్ళగడ్డలోనే అఖిలకు చంద్రబాబు టికెట్ ఇస్తారా ? ఇచ్చినా ఆమె గెలుస్తారా అనేది సందేహమే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎలాగున్నా ఆళ్ళగడ్డ, నంద్యాలలో అఖిల బాగా కంపైపోయారు. ఎక్కడ చూసినా గొడవలే, ఏ నేతతోను సరైన సంబంధాలు లేవు. ఎవరిని పడితే వారిని ఎంతపడితే అంత మాట్లాడుతారనే ప్రచారం బాగా ఉంది. సీనియర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వరన్న కారణంగానే చాలామంది నేతలు మాజీమంత్రికి దూరమైపోయారు. మరిలాంటి సమయంలో నంద్యాలలో అఖిల పోటీ అంటే ఆలోచించాల్సిందే.
This post was last modified on September 19, 2022 9:33 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…