Political News

పార్టీలో కొత్త గొడవకు కారణమైన భూమా అఖిల

మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది.

ఎప్పుడైతే అఖిల వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయటానికి ట్రై చేస్తున్నారనే ప్రచారం మొదలైందో వెంటనే నంద్యాలలోని నేతలంతా అలర్టయ్యారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి లాంటి నేతలంతా గోల పెడుతున్నారు. వీళ్ళ గోలకు కారణం ఏమిటంటే నంద్యాలలో పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అఖిల మంచి భవనం కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే ఆళ్ళగడ్డలో పార్టీ ఆఫీసుతో సంబంధంలేకుండా సొంతంగా ఆమె ఒక ఆఫీసును పెట్టుకున్నారు.

ఆళ్ళగడ్డలో ఉన్నట్లే నంద్యాలలో కూడా సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దానికితోడు ఎక్కువగా నంద్యాలలోనే అఖిల క్యాంపు వేస్తున్నారట. ఆళ్ళగడ్డకన్నా నంద్యాలలోనే అఖిల ఎక్కువగా కనబడుతుండటంతో పార్టీలో కూడా అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఫరూక్ అండ్ కో చంద్రబాబునాయుడుతో ప్రస్తావించారట. అయితే చంద్రబాబు స్పందన ఏమిటో బయటకు రాలేదు. కానీ నేతల్లో గందరగోళం మాత్రం పెరిగిపోతోందట.

అసలు ఆళ్ళగడ్డలోనే అఖిలకు చంద్రబాబు టికెట్ ఇస్తారా ? ఇచ్చినా ఆమె గెలుస్తారా అనేది సందేహమే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎలాగున్నా ఆళ్ళగడ్డ, నంద్యాలలో అఖిల బాగా కంపైపోయారు. ఎక్కడ చూసినా గొడవలే, ఏ నేతతోను సరైన సంబంధాలు లేవు. ఎవరిని పడితే వారిని ఎంతపడితే అంత మాట్లాడుతారనే ప్రచారం బాగా ఉంది. సీనియర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వరన్న కారణంగానే చాలామంది నేతలు మాజీమంత్రికి దూరమైపోయారు. మరిలాంటి సమయంలో నంద్యాలలో అఖిల పోటీ అంటే ఆలోచించాల్సిందే.

This post was last modified on September 19, 2022 9:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

1 hour ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

3 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

4 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

4 hours ago