మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది.
ఎప్పుడైతే అఖిల వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయటానికి ట్రై చేస్తున్నారనే ప్రచారం మొదలైందో వెంటనే నంద్యాలలోని నేతలంతా అలర్టయ్యారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డి లాంటి నేతలంతా గోల పెడుతున్నారు. వీళ్ళ గోలకు కారణం ఏమిటంటే నంద్యాలలో పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అఖిల మంచి భవనం కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే ఆళ్ళగడ్డలో పార్టీ ఆఫీసుతో సంబంధంలేకుండా సొంతంగా ఆమె ఒక ఆఫీసును పెట్టుకున్నారు.
ఆళ్ళగడ్డలో ఉన్నట్లే నంద్యాలలో కూడా సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దానికితోడు ఎక్కువగా నంద్యాలలోనే అఖిల క్యాంపు వేస్తున్నారట. ఆళ్ళగడ్డకన్నా నంద్యాలలోనే అఖిల ఎక్కువగా కనబడుతుండటంతో పార్టీలో కూడా అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఫరూక్ అండ్ కో చంద్రబాబునాయుడుతో ప్రస్తావించారట. అయితే చంద్రబాబు స్పందన ఏమిటో బయటకు రాలేదు. కానీ నేతల్లో గందరగోళం మాత్రం పెరిగిపోతోందట.
అసలు ఆళ్ళగడ్డలోనే అఖిలకు చంద్రబాబు టికెట్ ఇస్తారా ? ఇచ్చినా ఆమె గెలుస్తారా అనేది సందేహమే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎలాగున్నా ఆళ్ళగడ్డ, నంద్యాలలో అఖిల బాగా కంపైపోయారు. ఎక్కడ చూసినా గొడవలే, ఏ నేతతోను సరైన సంబంధాలు లేవు. ఎవరిని పడితే వారిని ఎంతపడితే అంత మాట్లాడుతారనే ప్రచారం బాగా ఉంది. సీనియర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వరన్న కారణంగానే చాలామంది నేతలు మాజీమంత్రికి దూరమైపోయారు. మరిలాంటి సమయంలో నంద్యాలలో అఖిల పోటీ అంటే ఆలోచించాల్సిందే.
This post was last modified on September 19, 2022 9:33 pm
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…