Political News

కువైట్: 8 లక్షల మంది ఎన్నారైలకు నరకం

కువైట్ భారతీయులకు, భారత ప్రభుత్వానికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. సగం ఇండియన్లను దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కువైట్ జాతీయ అసెంబ్లీ శాసనసభ కమిటీ ఆమోదించింది. దీని ఫలితంగా 8 లక్షల మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళకతప్పదు. ఈ బిల్లు ప్రకారం, భారతీయులు కువైట్ జనాభాలో 15 శాతానికి మించరాదు. ప్రస్తుతం అక్కడ 30 శాతానికి పైగా ఇండియన్లు ఉన్నారు.

ఈ బిల్లు కారణంగా ఆ దేశంలో స్థిరపడిన మొత్తం 14.5 లక్షల భారీతయ జనాభాలో 800,000 మంది భారతీయులు కువైట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటందని స్థానిక మీడియా పేర్కొంది.

కువైట్ మొత్తం 4.3 మిలియన్ల జనాభాలో ఇమ్మిగ్రెంట్స్ సంఖ్య 3 మిలియన్లు. అంటే 70 శాతం విదేశీయులు, 30 స్వదేశీయులు కువైట్లో నివసిస్తున్నారు. గత నెలలో, కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా, జనాభాలో 70 శాతం నుండి 30 శాతానికి నిర్వాసితుల సంఖ్యను తగ్గించాలని చేసిన ప్రతిపాదన మేరకు ఈ బిల్లును రూపొందించి ఆమోదించారు. ఈ బిల్లు మరిన్ని దశలు దాటాల్సి ఉంది.అయితే… దీనికి స్థానిక రాజకీయ మద్దతు కూడా ఉండటంతో ఈ బిల్లు అమలులోకి రావడం గ్యారంటీ.

విచారకరం ఏంటంటే… ఇది కరోనా తెచ్చిన ముప్పే. కరోనా కారణంగా ఆ దేశంలో ఉపాధి బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కడానికి విదేశీయులపై పడ్డారు. పైగా అత్యధికంగా ఉండే భారతీయులను పంపించేస్తే తమ ఉద్యోగాలు తమకు వస్తాయన్న సెంటిమెంట్ కూడా స్థానిక ప్రజల్లో బలంగా ఉందట. తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 49,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

This post was last modified on July 6, 2020 10:41 am

Share
Show comments
Published by
Satya
Tags: IndiaKuwait

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago