Political News

కువైట్: 8 లక్షల మంది ఎన్నారైలకు నరకం

కువైట్ భారతీయులకు, భారత ప్రభుత్వానికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. సగం ఇండియన్లను దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కువైట్ జాతీయ అసెంబ్లీ శాసనసభ కమిటీ ఆమోదించింది. దీని ఫలితంగా 8 లక్షల మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళకతప్పదు. ఈ బిల్లు ప్రకారం, భారతీయులు కువైట్ జనాభాలో 15 శాతానికి మించరాదు. ప్రస్తుతం అక్కడ 30 శాతానికి పైగా ఇండియన్లు ఉన్నారు.

ఈ బిల్లు కారణంగా ఆ దేశంలో స్థిరపడిన మొత్తం 14.5 లక్షల భారీతయ జనాభాలో 800,000 మంది భారతీయులు కువైట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటందని స్థానిక మీడియా పేర్కొంది.

కువైట్ మొత్తం 4.3 మిలియన్ల జనాభాలో ఇమ్మిగ్రెంట్స్ సంఖ్య 3 మిలియన్లు. అంటే 70 శాతం విదేశీయులు, 30 స్వదేశీయులు కువైట్లో నివసిస్తున్నారు. గత నెలలో, కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా, జనాభాలో 70 శాతం నుండి 30 శాతానికి నిర్వాసితుల సంఖ్యను తగ్గించాలని చేసిన ప్రతిపాదన మేరకు ఈ బిల్లును రూపొందించి ఆమోదించారు. ఈ బిల్లు మరిన్ని దశలు దాటాల్సి ఉంది.అయితే… దీనికి స్థానిక రాజకీయ మద్దతు కూడా ఉండటంతో ఈ బిల్లు అమలులోకి రావడం గ్యారంటీ.

విచారకరం ఏంటంటే… ఇది కరోనా తెచ్చిన ముప్పే. కరోనా కారణంగా ఆ దేశంలో ఉపాధి బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కడానికి విదేశీయులపై పడ్డారు. పైగా అత్యధికంగా ఉండే భారతీయులను పంపించేస్తే తమ ఉద్యోగాలు తమకు వస్తాయన్న సెంటిమెంట్ కూడా స్థానిక ప్రజల్లో బలంగా ఉందట. తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 49,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

This post was last modified on July 6, 2020 10:41 am

Share
Show comments
Published by
Satya
Tags: IndiaKuwait

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

18 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago