Political News

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎంతో తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం ఢిల్లీలో ముఖ్యనేతలతో మేథోమథనం జరిగింది. జేపీ నడ్డాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 144 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు.

144 ఎంపీ సీట్లంటే ఇప్పటివరకు గెలవని స్ధానాలను గెలవాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో బీజేపీకి సొంతంగా 305 ఎంపీ సీట్లున్నాయి. ఈ సీట్లను గెలుచుకుంటూనే అదనంగా 144 సీట్లను గెలవాలని అమిత్ షా చెప్పారు. ఈ 144 సీట్ల లెక్కేమిటంటే పోయిన ఎన్నికల్లో రెండు, మూడు స్ధానాల్లో నిలిచిన స్ధానాలట. పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఇపుడు పెట్టుకున్న టార్గెట్.

ఈ సీట్లు కూడా తెలంగాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లోనే గెలవటానికి ఎక్కువగా అవకాశాలున్నాయని సమావేశం గుర్తించింది. ఈ 144 సీట్లలో గెలుపు అవకాశాలు పెంచుకునేందుకు వీలుగా కేంద్రమంత్రులు, ఎంపీలను ఇన్చార్జిలుగా నియమించాలని డిసైడ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు స్ధానిక నాయకత్వంతో కలిసి లెక్కలన్నీ తీయాలని డిసైడ్ చేశారు. బీజేపీ గుర్తించిన ఎంపీ సీట్లలో సామాజిక వర్గం లెక్కలు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లుంటాయనే అంచనాలతో సర్వేలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.

బీజేపీ వరస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఇప్పటినుండే పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండటం కూడా ఓట్ల చీలిక జరిగి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. పైగా అసమ్మతి పెద్దగా లేకపోవటం, నరేంద్రమోడీ లాంటి బలమైన ఏక నాయకత్వం ఉండటం బీజేపీకి ప్రస్తుతానికి బాగా కలిసొస్తోంది. మరి తన టార్గెట్ ను బీజేపీ ఎంతవరకు రీచవుతుందో చూడాలి.

This post was last modified on September 7, 2022 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

6 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago