వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం ఢిల్లీలో ముఖ్యనేతలతో మేథోమథనం జరిగింది. జేపీ నడ్డాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 144 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు.
144 ఎంపీ సీట్లంటే ఇప్పటివరకు గెలవని స్ధానాలను గెలవాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో బీజేపీకి సొంతంగా 305 ఎంపీ సీట్లున్నాయి. ఈ సీట్లను గెలుచుకుంటూనే అదనంగా 144 సీట్లను గెలవాలని అమిత్ షా చెప్పారు. ఈ 144 సీట్ల లెక్కేమిటంటే పోయిన ఎన్నికల్లో రెండు, మూడు స్ధానాల్లో నిలిచిన స్ధానాలట. పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది ఇపుడు పెట్టుకున్న టార్గెట్.
ఈ సీట్లు కూడా తెలంగాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లోనే గెలవటానికి ఎక్కువగా అవకాశాలున్నాయని సమావేశం గుర్తించింది. ఈ 144 సీట్లలో గెలుపు అవకాశాలు పెంచుకునేందుకు వీలుగా కేంద్రమంత్రులు, ఎంపీలను ఇన్చార్జిలుగా నియమించాలని డిసైడ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు స్ధానిక నాయకత్వంతో కలిసి లెక్కలన్నీ తీయాలని డిసైడ్ చేశారు. బీజేపీ గుర్తించిన ఎంపీ సీట్లలో సామాజిక వర్గం లెక్కలు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లుంటాయనే అంచనాలతో సర్వేలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.
బీజేపీ వరస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఇప్పటినుండే పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండటం కూడా ఓట్ల చీలిక జరిగి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. పైగా అసమ్మతి పెద్దగా లేకపోవటం, నరేంద్రమోడీ లాంటి బలమైన ఏక నాయకత్వం ఉండటం బీజేపీకి ప్రస్తుతానికి బాగా కలిసొస్తోంది. మరి తన టార్గెట్ ను బీజేపీ ఎంతవరకు రీచవుతుందో చూడాలి.
This post was last modified on September 7, 2022 12:18 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…