ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నరసరావు పేట. ఒకప్పుడు బలమైన టీడీపీ నాయకులు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే.. వరుస విజయాలతో వైసీపీ దూకుడు చూపిస్తోంది. డాక్టర్.. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరనలో ఆయన కు బెర్త్ లభిస్తుందని అనుకు న్నారు. కానీ, ఆయనకు రెడ్డి ట్యాగ్ కారణంగా.. లభించలేదని.. ఆయన వర్గం అప్పట్లోనే బాహాటంగా చెప్పింది. ఇక, ప్రజా వైద్యుడిగా ఆయనకు పేరుంది. దీంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి కనిపిస్తోంది.
కానీ, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బలమైన నాయకుడిని రంగంలోకి దింపుతారని చెబుతున్నారు. కోడెల శివరామకృష్ణను రంగంలోకి దింపాలని.. ఇక్కడి నాయకులు కోరుతున్నారు. అయితే..దీనిపై చంద్రబాబు కానీ.. పార్టీ సీనియర్లు కానీ.. పెదవి విప్పడం లేదు. మరోవైపు.. రాయపాటి కుమారుడు.. రంగారావు.. ఇక్కడ కర్చీఫ్ వేసి ఉన్నట్టు.. కూడా ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది.
ఎవరు పోటీ చేసినా.. గెలుపు మాత్రం తమదేనని వైసీపీ బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉండడం గమనార్హం. ప్రధానంగా రాజధాని ఎఫెక్ట్.. డాక్టర్ ఎమ్మెల్యేను కలవరపెడుతోంది. అమరావతిని కోరుకుంటున్న వారు ఇక్కడ ఎక్కువగా ఉండడం. పైగా.. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రెండూ కూడా.. అమరావతి కావాలని చెబుతుండడంతో ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిస్తితి ఏర్పడింది. ఇంకో వైపు.. టీడీపీ రాజధానిగా అమరావతినే ఉండాలని కోరుకుంటోంది. రాయపాటి కుటుంబం కూడా యాక్టివ్గా రైతు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది.
ఈ పరిణామాలతో టీడీపీకి అనుకూలంగా ఇక్కడ పరిస్థితి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుంది.. ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు? అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఈకీలకమైన నియోజకవర్గంలో పోటీ .. మాత్రం భీకరంగా ఉంటుందని.. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర పోటీ జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. డాక్టర్ ఎమ్మెల్యేపై సానుభూతి పనిచేస్తుందని.. ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. రాజధాని ఎఫెక్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని.. టీడీపీ అంటోంది. ఇలా ఎలా చూసుకున్నా.. రెండు పార్టీల్లోనూ తర్జన భర్జన అయితే.. కొనసాగుతుండడం గమనార్హం.
This post was last modified on September 1, 2022 10:23 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…