రాజకీయాల్లో ఎవరో ఒకరు.. అన్నట్టుగా.. ఇప్పుడు టీడీపీలో పాలకొల్లు నియోజకవర్గం తాలూకు.. విజయం తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ముందున్న కీలక వ్యూహం.. పార్టీని ఎట్టిపరిస్థితిలోనూ.. అధికారంలోకి తీసుకురావడమే. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తే.. బెటరో.. ఇప్పటికే ..అనేక ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి కూడా. ఈ క్రమంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు పాలకొల్లు ఫైల్ చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ నుంచి వరుసగా.. టీడీపీ విజయం దక్కించుకుంటోంది. వరుసగా నిమ్మల రామానాయుడు గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. గత జగన్ సునామీలోనూ.. ఆయన విజయం సాధించారు. అయితే.. సాధించిన దానికి ఆయన సంతృప్తి చెందలేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. కూడా.. ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకుంటున్నారు. వారికి ఆర్థికంగా.. ఇతరత్రా కూడా అండగా నిలుస్తున్నారు.
అంతేకాదు.. అదేసమయంలో ప్రభుత్వంపై చురక్కు- చమక్కు అన్నట్టుగా.. విమర్శలు కూడా చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ కార్యక్రమాలను.. ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బలమైన గళం వినిపిస్తున్నారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గంలో మరో పార్టీ పావులు కదపకుండా.. బలం పుంజుకోకుండా.. ఎమ్మెల్యే నిమ్మల వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనేది వాస్తవం. ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో.. పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో పాలకొల్లు ముందు వరుసలో ఉన్నట్టు తేలింది.
అంతేకాదు.. ఇక్కడ నిమ్మలకు తిరుగేలేదని.. కూడా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మల అనుసరిస్తున్న ఫార్ములాను.. రాష్ట్రంలో కనీసం 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తే.. ఖచ్చితంగా పార్టీ పుంజుకుని.. సునాయాశంగా అధికారంలోకి వస్తుందనేది సీనియర్ల మాట. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ను రెడీ చేసుకుని.. ప్రతి నియోజకవర్గానికీ.. దీనిని అందించి.. పార్టీ విజయం దిశగా.. నాయకులను నడిపించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తారో.. లేదో చూడాలి.
This post was last modified on August 31, 2022 11:05 pm
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…