రాజకీయాల్లో ఎవరో ఒకరు.. అన్నట్టుగా.. ఇప్పుడు టీడీపీలో పాలకొల్లు నియోజకవర్గం తాలూకు.. విజయం తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ముందున్న కీలక వ్యూహం.. పార్టీని ఎట్టిపరిస్థితిలోనూ.. అధికారంలోకి తీసుకురావడమే. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తే.. బెటరో.. ఇప్పటికే ..అనేక ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి కూడా. ఈ క్రమంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు పాలకొల్లు ఫైల్ చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ నుంచి వరుసగా.. టీడీపీ విజయం దక్కించుకుంటోంది. వరుసగా నిమ్మల రామానాయుడు గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. గత జగన్ సునామీలోనూ.. ఆయన విజయం సాధించారు. అయితే.. సాధించిన దానికి ఆయన సంతృప్తి చెందలేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. కూడా.. ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకుంటున్నారు. వారికి ఆర్థికంగా.. ఇతరత్రా కూడా అండగా నిలుస్తున్నారు.
అంతేకాదు.. అదేసమయంలో ప్రభుత్వంపై చురక్కు- చమక్కు అన్నట్టుగా.. విమర్శలు కూడా చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ కార్యక్రమాలను.. ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బలమైన గళం వినిపిస్తున్నారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గంలో మరో పార్టీ పావులు కదపకుండా.. బలం పుంజుకోకుండా.. ఎమ్మెల్యే నిమ్మల వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనేది వాస్తవం. ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో.. పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో పాలకొల్లు ముందు వరుసలో ఉన్నట్టు తేలింది.
అంతేకాదు.. ఇక్కడ నిమ్మలకు తిరుగేలేదని.. కూడా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మల అనుసరిస్తున్న ఫార్ములాను.. రాష్ట్రంలో కనీసం 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తే.. ఖచ్చితంగా పార్టీ పుంజుకుని.. సునాయాశంగా అధికారంలోకి వస్తుందనేది సీనియర్ల మాట. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ను రెడీ చేసుకుని.. ప్రతి నియోజకవర్గానికీ.. దీనిని అందించి.. పార్టీ విజయం దిశగా.. నాయకులను నడిపించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తారో.. లేదో చూడాలి.
This post was last modified on August 31, 2022 11:05 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…